నిర్భయ హత్యాచార కేసులో దోషులుగా తేలిన నలుగురికి ప్రాణభయం పట్టుకుంది. ఈ నెల 22న మరణశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు తీర్పునిస్తూ డెత్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో దోషులకు కంటి మీద కునుకు కరువై పోయింది. ఉరి శిక్ష భయం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తీహాడ్ జైలు అధికారులు తెలిపారు. ఈ భయంతోనే నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తన సెల్ లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.
ముకేశ్ మినహా ముగ్గురు దోషులు జైల్లో పనిచేస్తూ రూ.1.37 లక్షలు సంపాదించారు. ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. వారిని ఎప్పుడు కలుసుకోవాలని అనుకుంటున్నారని జైలు సిబ్బంది దోషులను అడగ్గా సమాధానం చెప్పలేదని జైలు అధికారులు వెల్లడించారు. దోషులు స్పందించకపోతే వారి కుటుంబసభ్యులను ఎప్పుడు కలవాలనే తేదీని జైలు అధికారులే నిర్ణయిస్తారు.
ఇదిలావుండగా.. నిర్భయ కేసును కూడా పార్టీలు రాజకీయాంగా వినియోగించుకుంటున్నాయి. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోనే ఆప్ ప్రభుత్వం దోషులందరికీ నోటీసులు ఇచ్చి ఉంటే ఈ పాటికి వారిని ఉరి తీసి ఉండేవది.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని జవదేకర్ ఆరోపించారు.
నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం గత రెండున్నరేళ్ళలో నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసేందుకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఢిల్లీ పాటియాలా కోర్టు సూచించింది. దీంతో నిందితుల్లో ఒకరైన ముకేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్షశ్ర పిటీషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరింది. ఆ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నక్ సిఫార్సు చేశారు.
2012 డిసెంబర్ 16 వ తేదీ రాత్రి ఢిల్లీలోని బస్సులో 23 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేసినందుకు నిందితులకు కోర్టు మరణశిక్ష విదించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారిని ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్ధానం కొట్టి వేసింది. దీంతో దోషుల్లో మరోకరైన ముకేష్ సింగ్ రాష్ట్రపతి. ఢిల్లీ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్ష అమలు చేసేందుకు నిబంధనలు ఒప్పకోవని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఫ్రభుత్వానికి లేఖ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more