రెక్కాడితేనేగానీ పొట్ట నిండని పరిస్థితిలో ఉన్న ఓ కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఐటీశాఖ నుంచి అతనికి రూ.కోటి కట్టాలని ఇటీవలే నోటీసు వచ్చింది. దీంతో అతను ఆశ్చర్యపోయాడు. ముందుసారి నోటీసు వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. పొరపాటున వచ్చిందేమో అనుకొని, కొద్ది రోజుల తర్వాత ఆ విషయమే మరచిపోయాడు. మళ్లీ నోటీసు రావడంతో కంగారు పడిపోయి, పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్కు చెందిన బావ్ సాహెబ్ అహీర్ బతుకుదెరువు కోసం కొనాళ్ల క్రితం ముంబయికి వెళ్లాడు. అక్కడ రోజువారీ కూలీ పనులకు వెళ్తూ పొట్ట పోషించుకుంటున్నాడు. బంధువు ఇంట్లోనే ఉంటూ రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నాడు. ఈ స్థితిలో ఉన్న అహీర్కు ఓ రోజు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. ఆదాయపు పన్ను కింద రూ. 1.05 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. కొన్నాళ్ళకు ఆ విషయం మరచిపోయాడు.
కొద్ది రోజులు గడిచాక, అదే నోటీసు మళ్లీ రావడంతో భయపడిపోయిన అహీర్.. పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ నోటీసులు ఎందుకు వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పెద్ద నోట్ల రద్దు సమయంలో అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని తెలిసింది. దానికి పాన్ నెంబరు జత చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పన్ను కట్టాలని నోటీసులు పంపినట్లు వెల్లడైంది. అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారుల వద్ద ఆధారాలున్నాయి. అయితే, అసలు తనకు బ్యాంకు ఖాతానే లేదని అహీర్ వాదిస్తుండడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more