బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై వైమానిక దాడికి పాల్పడి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులెమాన్ ను హతమార్చినందకు.. అమెరికా బలగాలున్న ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇదివరకే ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిందంటే ఆ దేశంలో ఎంతంటి ప్రతీకారంతో రగలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. తమ దేశ సైనిక ఉన్నాతాధాకారి మరణం ఆ దేశాన్ని ఎంతలా కుంగదీసిందో కూడా ఈ చర్యలతో అర్థమవుతోంది.
అయితే అమెరికాపై ఇరాన్ కొనసాగిస్తున్న ప్రతీకార దాడులు ఇంకా కొనసాగేలానే వున్నాయి. ఇరు దేశాల మధ్య మరీ ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్దమేఘాలు అలుముకునేలా చేస్తోంది. ఒక దేశం ఆధిపత్యం కోసం మరో దేశం ప్రతీకారం కోసం సాగిస్తున్న క్షిఫుణలు దాడి ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా క్షిపణులతో దాడి చేసి ఏకంగా 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజునే మరో ప్రతీకార దాడికి పాల్పడింది ఇరాన్.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని గ్రీన్ జోన్ పరిధిలోని అమెరికా ఎంబసీని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ రెండు రాకెట్లను ప్రయోగించింది. దీంతో అత్యంతకీలకమైన గ్రీన్ జోన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా విదేశాంగ రాయభారి కార్యాలయంతో పాటు పలు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. గ్రీన్ జోన్ లోపల రెండు కత్యూష రాకెట్లు పడి ఉన్నాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్ లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
సైనికాధాకారి మరణానికి ప్రతీకారం.. ఎవరీ సులేమాన్...
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లో కీలక నిఘా విభాగం అయిన ఖడ్స్ ఫోర్స్కి మేజర్ జనరల్ ఖాసీం సులెమాన్ 1998 నుంచి అధిపతిగా ఉన్నారు. సరిహద్దు వెలుపల జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్పై పోరులో ఖాసీం కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమనెయ్కి ఖాసీం నేరుగా రిపోర్ట్ చేస్తారు. 1980లో జరిగిన ఇరాక్-ఇరాన్ యుద్ధంలో తొలిసారి ఖాసీం వెలుగులోకి వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more