ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్టితో 23వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకున్న రైతులు నిరసన చేపట్టారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు మద్దతుగా ఆయా ప్రాంత యువకులు, మహిళలు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.
కాగా, రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా తుళ్లూరు ధర్నా చౌక్ వద్ద దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్ అమరావతి’ అంటూ రైతులు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.
టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి రైతులు పాదయాత్రగా బయల్దేరారు. నందివెలుగు సమీపంలోకి పాదయాత్ర చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు.
దీంతో కాస్త వెనక్కి తగ్గిన పోలీసులు పాదయాత్ర నందివెలుగు దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరోసారి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాదయాత్రను అడ్డుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు జీపులో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా రైతులు, టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పాదయాత్రతో గుంటూరు-తెనాలి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more