సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోని నిందితుల మృతదేహాలకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రి నుంచి వచ్చిన ఫోరెన్సిక్స్ నిపుణుల బృందం క్రితం రోజున పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు మేరకు ఎయిమ్స్ అసుపత్రికి చెందిన నిపుణులు పూర్తి పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించి చిత్రీకరించిన వీడియోను ఇవాళ న్యాయస్థానంలో సమర్పించారు.
దీనితో పాటుగా దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా ఎయిమ్స్ వైద్యులు హైకోర్టులో సమర్పించారు. ఇవాళ ఉదయం సీడితో పాటు ప్రాథమిక నివేదికతో హైకోర్టుకు చేరకున్న ఎయిమ్స్ వైద్యులు హైకోర్టు రిజిస్ట్రార్ కు వాటిని సమర్పించారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెచ్ వోడీ డాక్టర్ సుధీర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ్ చంద్రలతో కూడిన బృందం దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి నివేదికను వారం రోజుల్లో అందజేస్తామని వైద్యులు తెలిపారు.
రీపోర్టుమార్టం తరువాత నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు పోలీసులు అందజేశారు. దీంతో రెండు అంబులెస్సులలో నాలుగు మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. గ్రామల వద్ద కూడా పోలీసులు బందోబస్తు నడుమ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులు.. గ్రామస్థుల సహకారంతో తీసుకుని వెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు. చీకటి పడడం.. రోడ్డుపై నుంచి గ్రామానికి దూరం కారణంగా మూడు ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసిన గ్రామస్థులు రాత్రిలోపు అంత్యక్రియలను పూర్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more