దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైందని పేర్కొంటూ.. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక వాతావరణం అలుముకున్న తరుణంలో కేంద్ర మంత్రి కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతు్న అందోళనకారులపై రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగాడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న అందోళనకారులకు ఆయన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా వున్నాయి.
నిరసనల్లో భాగంగా ఆందోళనకారులెవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వారిని అక్కడికక్కడే కాల్చి పడేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా పశ్చిమబెంగాల్ లో కొందరు ఆందోళనకారులు ముర్షీదాబాద్ రైల్వేస్టేషన్ కు నిప్పుపెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తిని ధ్వంసం చేసే ఎవరినైనా కాల్చి పడేయాలని కేంద్ర మంత్రిగా తాను అధికారులకు చెప్పినట్టు అంగాడీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే శాఖ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు.
రైల్వేల అభివృద్ధికి 13 లక్షల మంది రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రతిపక్షాల మద్దతుతో సమస్యలు సృష్టిస్తున్నాయని అన్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఎలాంటిదైనా.. అందోళనకారులను మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా కొనసాగుతున్న మంత్రికి పౌరసత్వం సవరణ బిల్లు నోప్పులు ఎలా అర్థమవుతాయని, తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. తాము కూడా భారత్ దేశంలో భాగమేనని, తమ డబ్బులు కూడా కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేస్తోందని.. కానీ తమ నిరసనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా బిల్లను అమోదించడం ఎలా సమ్మతిస్తామని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more