దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులకు గతంలోనే ఉరిశిక్షను ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు అదే తీర్పును వెలుగెత్తింది. హత్యాచార కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థాన విచారణపై సమీక్షను కోరే హక్కు దోషులకు లేదని.. అతడి పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పాటు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అములు చేయనున్నట్లు కూడా ప్రకటించింది.
తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన అక్షరు కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బోపన్నాలతో కూడాన త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్పు వెలువరించింది. పునఃసమీక్ష అంటే పునఃవిచారణ కాదని, ఇప్పటికే ఈ కేసులోని అన్ని ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం దోషులకు గతంలోనే ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని ధర్మసనం వెలువరించింది.
''రివ్యూ పిటిషన్ వేయడానికి నలుగురు దోషులు అనర్హులు.. రివ్యూ పిటిషన్ వేయడానికి ఎందుకొచ్చారు. వీరిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేద''ని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్ ను తిరస్కరించారు. నిర్భయ కేసుకు సంబంధించి నలుగురు దోషులను ఎప్పుడు ఉరి వేస్తారో తెలియాల్సి ఉంది. గతంలో ఉరి శిక్ష తీర్పును ఎలా ఇచ్చారో.. ఆ తీర్పుకు మరింత బలం చేకూరేలా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కాగా, అక్షయ్ కుమార్ వేసిన రివ్యూ పిటీషన్ లో ‘ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఉంది.. దానిని ప్రతిరోజూ పీల్చుతూనే సగం చచ్చాం.. ఇక ఉరి శిక్షతో ఎందుకు పూర్తిగా చంపుతారు.. ఇలాగే ఈ గాలి పీల్చుతూనే చస్తామని పిటీషన్ లో పేర్కోన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more