హైదరాబాద్ ఆరాంఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మాదాపూర్ లోని నారాయణ కళాశాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ నుంచి గత రాత్రి 9 మంది విద్యార్థులు అదృశ్యం కాగా, వారిలో ఇద్దరి మృతదేహాలు ఆరాంఘర్ సమీపంలో రోడ్డుపై కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ 9 మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ లో ఉంటున్న తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వీరంతా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లారు.
వేడుకల అనంతరం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోగా, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో మిగతా ఏడుగురికీ గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల అదృశ్యంపై గత రాత్రే నారాయణ కళాశాల సిబ్బంది మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
అంతేకాదు కాలేజీ హాస్టల్ పర్యవేక్షణపై కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. హాస్టల్ లో తమ పర్యవేక్షణలో పిల్లలు ఇంటర్ విద్యను అభ్యసిస్తే.. పోటీ ప్రపంచంలో మంచి మెరుగైన మార్కులను సాధిస్తారని చెప్పే కాలేజీ యాజమాన్యాల కల్లబోల్లి మాటలను నమ్మి ఎంతో మంది తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను హాస్టల్ లో చేర్పించి.. లక్షల రూపాయాల ఫీజులను చెల్లిస్తున్నారు. అయితే విద్యార్థులు ఏదో విధంగా హాస్టల్ ను దాటుకుని వస్తున్నారన్న విషయాలు తెలిసినా.. యాజమాన్యాలు మాత్రం దానిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
విద్యార్థులు అదృశ్యమయ్యారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో తమ పని ముగిసిపోయిందని భావిస్తే.. కోట్ల రూపాయలు వెచ్చింది భారీ ప్రకటనలు, ప్రచారాలు చేయించి విద్యార్థుల చేర్చుకోవడం ఎందుకో వారికైనా.. క్లారిటీ వుండాలి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లారంటే యాజమాన్య నిర్లక్ష్యపు ధోరణి ఇక్కడే ప్రస్పూటిస్తోంది. అయితే ఇద్దరు విద్యార్థుల నిండు నూరేళ్ల జీవితాన్ని బలిగొన్న రోడ్డు ప్రమాదఘటనతో ఈ విషయం బయటకు వచ్చింది కానీ.. ఇలా ఎంతమంది బయటకు వెళ్తున్నారోనన్న విషయమై ఇప్పటికైన యాజమాన్యాలు దృష్టిసారించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more