టెలికాం రంగంలో ఉచితాలతో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో కూడా తాజాగా ఎయిర్ టెల్, వొడాఫోన్ బాటలోనే పయనిస్తోంది. ఇటీవల కాలంలో తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్ పై నిమిషానికి ఆరు పైసల మేర చార్జీలను మోపుతున్నామని ప్రకటించిన జియో, తాము కూడా టెలికాం రంగంలో అధికభారాన్ని మోస్తున్నామని చెప్పంది. దీంతో తాము కూడా తమ కస్టమర్లపై కొద్దిగా భారం వేయకతప్పడం లేదని ప్రకటించింది. ఎయిర్ టెల్, వోడాఫోన్ టెలికాం కంపెనీల తరహాలోనే ఈ డిసెంబర్ మొదలు కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టేందుకు సిద్దమయ్యింది.
డిసెంబర్ 1 నుంచి తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనాన్ని సృష్టించింది. 'ఉచిత' వాయిస్ కాల్స్ తో పాటు పలు నెలల పాటు ప్రైమ్ సభ్యులకు ఉచిత డేటాను కూడా అందించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ ఫోన్ వినయోగదారులు తమ నెట్ వర్క్ ను జియోకు మార్చుకున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకుంది. టెలికాం రంగంలో తమ కంపెనీ భారాన్ని మోస్తోందని,
ఇటీవలే వాయిస్ కాల్స్ పై చార్జీలు వేసిన రిలయన్స్ జియో.. ప్రత్యర్థి కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ బాటలోనే పయనిస్తోంది. తమ రిలయన్స్ జియో కూడా రానున్న కొన్ని వారాల్లోనే టారిఫ్ ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే జియో ఈ ప్రకటన చేయడం గమనార్హం.
కాగా, జియో ఇప్పటికే నాన్-జియో కాల్స్కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు మొబైల్ చార్జీలు కూడా పెంచితే ఖాతాదారుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. డేటా వినియోగం, డిజిటలైజేషన్కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్ను పెంచుతామని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more