జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో అటు కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతూనే.. ఇటు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తన అస్త్రాలను సంధిస్తూనే వున్నారు. తొలి రెండు రోజులు అధికార పార్టీపై తనదైనశైలిలో సునిశిత విమర్శలు చేసిన పవన్.. గత రెండు రోజుల నుంచి కాసింత వాడి, వేడి తగ్గించారు. అయితేనేం తన సోషల్ మీడియాలో నిత్యం ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే వున్నారు. తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు విమర్శల సంధిస్తున్న ఆయన.. నిన్నటి వరకు భవననిర్మాణ కార్మికుల బతుకుల గురించి నిలదీశారు.
ఆ విషయంలో విజయం సాధించిన ఆయన.. తాజాగా మాతృబాష ఔనత్యాన్ని కాపాడాలని, కోరుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై స్పందించిన పవన్.. సీఎం జగన్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అన్నారు.. భాష సరస్వతిని అవమానించకండి అంటూ సూచనలు చేశారు. కమ్మనైన అమ్మదనం కేవలం మాతృభాషలోనే లభిస్తుందని, దానిని బావితరాలకు దూరం చేయడం వల్ల.. తెలుగు బాష ఉనికికే ప్రమాదమని పవన్ కల్యాణ్ పేర్కోన్నారు.
‘ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ.. తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే.. మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది. జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు.. తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు. జగన్ రెడ్డి గారు భాష సరస్వతిని అవమానించకండి’ అంటూ వరుసగా ట్వీట్లు చేశారు.
జగన్ రెడ్డి గారు ‘ భాష సరస్వతిని అవమానించకండి.’ pic.twitter.com/i5vkyQom4V
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి.
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more