ఆరోగ్యమే మహాబాగ్యం అని పెద్దలు చెప్పిన మాటలు అక్షరాల నిజం. అయితే ఈ విషయం చాలా బాగా అర్థం కావాలంటే మాత్రం అనారోగ్యం బారిన పడినప్పుడే. అసుపత్రుల చుట్టూ కళ్లరిగేలా తిరిగినా.. ఏదో ఒక రోజు మందుబిల్లలు మింగడం మానేని.. దేవుడా నువ్వే నా రోగాలను నయం చేయకూడదా.? అంటూ రోగులు అర్థిస్తుంటారు. ఇందుకు కారణంగా మాత్రలు మింగినా తమ అనారోగ్యం నయంకాకపోవడమే. దీంతో దేవుడిపైనే భారం వేస్తుంటారు. అయితే దేవుడు స్వయంగా తాను దిగివచ్చి తన భక్తుల రోగాలను హరించివేయలేడు.
అయితే భక్తుల అర్తిని మాత్రం విని ఊరుకోలేడు. దీంతో తన భక్తుల రోగాలను నయం చేసేందుకు కొన్ని మార్గాలను ఎంచుకుంటాడు. అలాంటిదే ఈ మహిమాన్వి వృక్షం. సరిగా బోధపడలేదా.? మరింత క్లారిటీగా చెప్పాలంటే.. అసుపత్రులకు వెళ్లినా తమ రోగాలు నయం కాని వాళ్లు, ఐసీయూలో ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్నవారు.. ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆ చెట్టు అదేనండీ వృక్షం తాకినా.. ఆ చెట్టు గాలి కాసింత సమయం పీల్చినా.. తమ రోగాలన్నీ నయమవుతున్నాయట. ఇలా ఒకరు కాదు ఇద్దరు ఏకంగా పది లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం ఆ వృక్షం వద్దకు వెళ్లారు.
ఔనా నిజమేనా అన్న అనుమానాలు తలెత్తే వారు కూడా ఔరా అంటూ తమ రోగాలను నయం చేసుకునేందుకు అడవి బాట పట్టారు. ఎందుకంటే ఆ వృక్షం వున్నది అక్కడే. అద్వితీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్ లోని సాత్పురా టైగర్ రిజర్వ్లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ 25 వేల నుంచి 30 వేల మంది వరకు అక్కడికి వెళ్తున్నారు. ఇలా నేటికి సుమారు పది లక్షల మంది వరకు ఈ చెట్టును తాకి తమ రోగాలను నయం చేసుకున్నారు.
స్థానికంగా ఉండే రూప్ సింగ్ థాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. ‘‘కుంటుతూ నడిచే నేను.. ఓ రోజు పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. తర్వాత నాలో ఏదో మార్పును వచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకున్నాననిపించింది. ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా’’నని ఆ రైతు మాట్లాడిన వీడియా బయటకు రావడంతో.. అక్కడికి పేషెంట్ల తాకిడి పెరిగింది. ఆ చెట్టును తాకడం ద్వారా తనకు రోగం తగ్గిపోయిందని ఓ పేషెంట్ కూడా చెప్పడంతో.. రోగాలను తగ్గించుకోవడం కోసం కొందరు వీల్ చైర్లలోనూ అక్కడికి వెళ్తున్నారు.
అయితే రోజూ వేలాదిగా తరలి వస్తున్న వారికి రోగాలు ఏమాత్రం తగ్గాయో తెలీదు కానీ.. స్థానికంగా వ్యాపారం మాత్రం పెరిగిపోయింది. మినరల్ వాటర్, స్నాక్స్, కొబ్బరి బోండాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అతీంద్రియ శక్తులున్నాయని ప్రచారం చేస్తున్న ఆ చెట్టు ఫొటోలను కూడా విక్రయిస్తున్నారు. అడవిలోని చెట్టువద్దకు రాలేని వారు ఆ ఫొటోను చూసినా రోగాలు తగ్గిపోతాయన్నమాట. జనసంచారం అధికం కావడంతో.. వన్యప్రాణులు తిరగాడే ఆ అడవిలో.. చెత్తాచెదారం భారీగా పెరిగిపోతోంది. వాటి రక్షణకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసమే చెట్టు గురించి ఈ ప్రచారం చేశారని అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more