మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ క్రమంలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన నేతలు భేటీ కావడం.. బీజేపికి శివసేన పెట్టిన షరతునే శరద్ పవార్ కూడా పెట్టడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి శివసేన నెట్టివేయబడిందన్న వార్తులు వినిపిస్తున్నాయి.
కాగా, ఇవాళ అర్థరాత్రితో మహారాష్ట్రలోని గత బీజేపి ప్రభుత్వం పదవీకాలం ముగుస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల షెడ్యూల్డు విడుదలైన నాటి నుంచి మహారాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రిగా కోనసాగుతూ వస్తున్న ఫడ్నావిస్ గత ప్రభుత్వ పదవికాలం ముగియడం.. ఇవాళ రాజీనామా చేశారు. అయితే ఆయనను మరికొంతకాలం పాటు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తారన్ని వార్తలు వినబడినా.. శివసేన మాత్రం ఫడ్నావిస్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మహారాష్ట్రలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపి అవతరించినా.. మరో పార్టీ సహకారం లేకుండా అధికార పగ్గాలను చేపట్టే అవకాశం లేకపోవడం శరాఘతంగా పరిణమించింది. ఎన్నికలకు ముందు తమకు బీజేపి ఇచ్చిన మాటకు కట్టుబడి చెరో రెండున్నరేళ్ల కాలం పాటు అధికారాన్ని అనుభవించేందుకు సిద్దం అయితేనే తాము బీజేపితో కలసి నడుస్తామని శివసేన తేల్చిచెప్పడంతో.. ఆయన రాజీనామను సమర్పించారు.
తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more