Bulbul to turn very severe cyclonic storm పెను తుఫానుగా మారనున్న బుల్ బుల్.. కోస్తాంధ్రకు ఉపశమనం

Cyclone bulbul likely to turn very severe over next 24 hours

cyclone bulbul, Coastal Andhra Pradesh, Cyclone Bulbul, Cyclone Bulbul west bengal, west bengal Cyclone Bulbul, Odisha Cyclone Bulbul,Cyclone Bulbul bangladeh, copndition of Cyclone Bulbul, Telangana, bay of bengal, Telugu states rainfall, Rain in Telangana, Rain in Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Politics

Cyclone Bulbul, which lay around 930 km south- southeast of Kolkata, "might turn into a severe cyclonic storm by Thursday midnight and further intensify into a very severe cyclonic storm by Saturday evening", leading to rough sea conditions, an IMD official said.

పెను తుఫానుగా మారనున్న బుల్ బుల్.. కోస్తాంధ్రకు ఉపశమనం

Posted: 11/08/2019 04:17 PM IST
Cyclone bulbul likely to turn very severe over next 24 hours

బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుఫాను... తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కోస్తాంధ్ర ప్రాంతాలు తీవ్ర అందోళనకు గురయ్యాయి. హుద్దూద్ మొదలు వరుస తుఫాన్లతో అల్లాడిపోతున్నామని.. ఇప్పటికే తుపాన్లతో అపారనష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ఈ క్రమంలో వారికి ఉపశమనం ఇచ్చే వార్తను భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో బుల్ బుల్ తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం వరకూ ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది.

దీని ప్రభావంతో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని కోస్తాంధ్రకు ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది. కాగా.. బుల్‌బుల్‌ తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ఒడిశా అప్రమత్తమైంది. ఇది పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ దిశగా కదులుతున్నప్పటికీ దాని ప్రభావం ఒడిశాపైనా ఉంటుందని, తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

దీంతో ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ప్రధానంగా తీర ప్రాంతంలోని అధికారులను అప్రమత్తం చేసింది. బుల్‌బుల్‌ ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇక పెను గాలులు వీచే ప్రమాదముందని, అవి గంటకు 90 కిలోమీటర్ల వేగం వరకు పెరగొచ్చని పేర్కొంది. లొతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశాలు సైతం జారీ చేసింది. తుఫాను ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా కోస్తా జిల్లాల అధికారులను ప్రభుత్వం అదేశించింది. మరీ ముఖ్యంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles