ఆంధ్రప్రదేవ్ లోని కొత్త ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ హెడ్వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిర్వహించిన రివర్స్ టెండర్లతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి. హెడ్వర్క్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్ను ఒకే ప్యాకేజీగా నిర్ణయించి రూ.4,987 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్ 1 గా కంపెనీ కోట్ చేసిన ధరనే అంచనా వ్యయంగా నిర్ధారించి టెండర్లు ఆహ్వానించింది.
టెండర్లలో 12.6 శాతం తక్కువకు అంటే రూ.4,358 కోట్లకు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ మెఘా టెండర్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.628 కోట్లు ఆదా అయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే పెద్ద చిక్కు వచ్చి పడింది. తొలుత మొత్తం 8 సంస్థలు కాంట్రాక్ట్పై ఆసక్తి చూపినప్పటికీ చివరికి మెఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. మిగిలిన 7 సంస్థలు తప్పుకున్నాయి. ఇప్పుడిదే ప్రభుత్వానికి సమస్యగా మారింది.
రివర్స్ టెండరింగ్ విధానం ప్రకారం కనీసం రెండు సంస్థలైనా బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వమే స్వయంగా విధించిన నిబంధన. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 అదే స్పష్టం చేస్తోంది. రివర్స్ టెండరింగ్లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలని అందులో ఉంది. దాని ప్రకారం ఒక్కటే బిడ్ దాఖలైంది కాబట్టి టెండర్ ఖరారు చేసేందుకు వీలుపడదని జలవనరుల నిపుణుల వాదన.
ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రివర్స్ టెండరింగ్కు వెళ్లాలంటే కనీసం రెండు సంస్థలైనా బిడ్లు దాఖలు చేసి ఉండాలి. అలాగైతేనే ఒక సంస్థ ఎల్-1గా నిలిస్తే.. మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిబంధనలైతే సవరణలకు అవకాశం ఉండేది. ఇదే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విధానం కావడంతో సదరు నిబంధనలను పాటిస్తారో.. లైట్ తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more