Latest Decisions took By The TTD Trust Board టీటీడీ కొత్త పాలక మండలి సమావేశ నిర్ణయాలివే..

Latest decisions took by the ttd trust board new committee

Tirupati, Chairman YV Subbareddy, TTD employes, TTD board, Tirumala Tirupati Devasthanam

The meeting of governing Council of the TTD was held today, after the members taking oath. The meeting was chaired by YV Subbareddy. The members have discussed on various issues and took a couple of decisions.

టీటీడీ కొత్త పాలక మండలి సమావేశ నిర్ణయాలివే..

Posted: 09/23/2019 08:10 PM IST
Latest decisions took by the ttd trust board new committee

టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇటీవల కొత్త పాలక మండలిని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. తాజాగా, అఫీషియోతో కలిపి మొత్తం 28 మందిని సభ్యులుగా నియమించారు. గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలిని ఏర్పాటుచేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నలుగురు, కర్ణాటక ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర ఒక్కొక్కరికి ఇందులో సభ్యత్వం కల్పించారు.

శనివారమే ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయగా, మిగతా పాలక మండలి సభ్యులంతా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పాలక మండలి సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గిస్తూ తీర్మానం చేశారు. రూ.36 కోట్లతో ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు. గతంలో రూ.150 కోట్లతో రెండు విడతల్లో ఆలయాన్ని నిర్మించాలని భావించిన విషయం తెలిసిందే. తిరుపతి అవిలాల చెరువు అభివృద్ధికి రూ.48 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతిలో గరుడ వారధి నిర్మాణాన్ని కొనసాగించాలని.. టీటీడీలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కమిటీ ఏర్పాటుకు సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక అధికారిగా రవిప్రసాద్‌ను నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో నీటి సమస్యను నివారించడానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మించాలని తీర్మానించారు.

తిరుమల తరహాలో మొత్తం ఆరు దశల్లో రూ.150 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించాలని భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మేరకు నిధులు వెచ్చించడం సరికాదని తొలి దశలో రూ.36 కోట్లతో అంత:ప్రాకారం వరకు నిర్మించాలని తీర్మానించారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీని కోసం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాలను కేటాయించింది. 2020 డిసెంబరు లేదా 2021 జనవరి నాటికి పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జనవరిలో అక్కడ పనులు ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirupati  Chairman YV Subbareddy  TTD employes  TTD board  Tirumala Tirupati Devasthanam  

Other Articles