భారతీయ రిజర్వు బ్యాంకు మరో కొత్త నోటును మార్కెట్ లోకి త్వరలో విడుదల చేయనుంది. అదే కొత్త ఇరవై రూపాయల నోటు. పది రూపాయల నోటు, యాభై రూపాయల నోటు. వంద, రెండువందల నోట్లను కూడా కొత్త రూపొందించి భారతీయ అర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రూ.20 నోటును కూడా విడుదల చేయనుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ప్రకటనను వెలువరించింది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఈ నోటు ఉంటుందని ఆర్బీఐ పేర్కోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ఈ నోటు వెలువడనున్నట్టు తెలిపింది.
ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా ఈ కొత్త నోటు ఉన్నట్టు సమాచారం. కొత్త రూ.20 నోటుతో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో వంద రూపాయల మార్పిడికి అధికంగా వినియోగపడుతున్న రూపాయలు యాభై నోటు, పది నోట్లకు అదనంగా కొత్త 20 రూపాయల నోటు దోహదపడనుంది.
కొత్త 20 రూపాయల నోటు ప్రత్యేకతలు..
* నోటు సైజు 63 మి.మీ x 129 మి.మీ.
* నోటు ఒక వైపున్న సీత్రూ ప్రాంతంలో 20 సంఖ్య కనిపిస్తుంది. దేవనాగలి లిపిలో కూడా ఈ నంబర్ ఉంటుంది.
* నోటుకు ఒక వైపు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. ఆర్బీఐ, భారత్, ఇండియా, 20 కనిపిస్తాయి.
* గాంధీకి కుడివైపున ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
* గాంధీ బొమ్మకు మరోవైపున అశోక స్తంభం, 20 సంఖ్య వాటర్ మార్క్ లు ఉంటాయి.
* నోటుకు మరోవైపున ఎడమపక్కన నోటును ప్రింట్ చేసిన సంవత్సరం ఉంటుంది.
* స్వచ్ఛభారత్ నినాదంతో పాటు లోగో ఉంటుంది.
* అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది.
* ఎల్లోరా గుహల చిత్రం ముద్రించి ఉంటుంది.
* ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు మిశ్రమ రంగుతో ముద్రించి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more