ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కత నైట్ రైడర్స్ మధ్య క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. తోటి ప్రేక్షకుడి పట్ల అసభ్యపదజాలంతో దూషించి.. అతను క్రికెట్ మ్యాచ్ చూడకుండా మ్యాచ్ అద్యంతం వారు న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరంతా పీకల్లోతు మద్యం సేవించి స్టేడియంలోకి ప్రవేశించారని.. ఆ మత్తులోనే వారు ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తంచారని తోటి ప్రేక్షకుడు పోలీసులకు పిర్యాదు చేశారు.
అంతేకాదు తాను మ్యాచ్ చూడటానికి వచ్చానని, తనను మ్యాచ్ చూడనీయకుండా అటంకాలు కల్పించడం సముచితం కాదని వారితో అన్నందుకు వారు తనపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారని దాంతో పాటు తమతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారని వారు అన్నారని ప్రేక్షకుడు పోలీసులకిచ్చిన పిర్యాదులో పేర్కోన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ స్టేడియం వేదికగా నిన్న రాత్రి హైదరాబాద్ కోల్ కత్తా మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. మ్యాచ్ ను వీక్షించేందుకు ఆరుగురు యువతీయువకులు మద్యం తాగి వచ్చారు.
మ్యాచ్ జరుగుతుండగానే గ్యాలరీలో నానా హంగామా సృష్టించారు. ఇతర వీక్షకులను గేలి చేస్తూ రచ్చరచ్చ చేశారు. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చశాడు. దీంతో.. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్రెడ్డి, సురేష్, వేణుగోపాల్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న భరత్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ(41)ను మ్యాచ్ చూడనీయకుండా అడ్డుకున్నారు. దీంతో సంతోష్ ఉప్పల్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more