రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన పార్టీ జనసేన.. తొలిసారిగా ప్రజాక్షేత్రంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి విజయం చేకూరాలని జనసేన పార్టీ గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్ అతిరుద్రయాగం నిర్వహించారు. తమ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు రానున్న ఎన్నికలలో విజయం చేకూరాలని తోట చంద్రశేఖర్ దంపతులు శ్రీనివాసరావుపేటలో ఈ యాగాన్ని నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మార్పును రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సమకాలిన రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. లాభం లేదని.. పాతికేళ్లు పాటు ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతూ అవిర్భవించిన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ మార్పు కోరుకునే ప్రజలు రానున్న ఎన్నికలలో తమ తీర్పును ఇవ్వనున్నారని.. దాంతో రాజకీయ పక్షాలకు షాక్ తగలక తప్పదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో ప్రజాతీర్పుతో తమ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు అభిలాషిస్తున్నారని చంద్రశేఖర్ తెలిపారు.
ఎన్నికలలో విజయం కోసం అన్ని పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ బాట పట్టాయి. తెలంగాణలో అధికారం కోసం కేసీఆర్ రాజశ్యామల యాజం చేయడంతో అదే బాటలో వైసీపీ అదినేత జగన్ కూడా అత్యంత రహస్యంగా అదే యాగాన్ని నిర్వహించారన్న కథనాలు వచ్చాయి. ఆ తరువాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని విజయవాడ ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం నిర్వహించారు. ఇక తాజాగా జనసేన నేత తోట చంద్రశేఖర్ దంపతులు కూడా అతిరుద్రయాగం చేయడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more