Athi Rudra Yagam for Pawan Kalyan's victory పవన్ కల్యాణ్ విజయం కోసం తోట చంద్రశేఖర్ అతిరుద్ర యాగం

Thota chandrasekhar conducts athi rudra yagam for pawan kalyan s victory

Thota Chandrasekhar, Guntur West assembly seat, Janasena MLA candidate, Athi Rudra Yagam, Pawan Kalyan's Janasena, Pawan Kalyan's Janasena victory, Pawan Kalyan's victory, janasena, Guntur, Andhra Pradesh, Politics

The Janasena party Guntur West MLA candidate Thota Chandrasekhar conducts Athi Rudra Yagam for Pawan Kalyan's victory in 2019 elections in the state.

పవన్ కల్యాణ్ ను విజయం వరించాలని తోట చంద్రశేఖర్ అతిరుద్రయాగం

Posted: 04/04/2019 05:24 PM IST
Thota chandrasekhar conducts athi rudra yagam for pawan kalyan s victory

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన పార్టీ జనసేన.. తొలిసారిగా ప్రజాక్షేత్రంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి విజయం చేకూరాలని జనసేన పార్టీ గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్ అతిరుద్రయాగం నిర్వహించారు. తమ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు రానున్న ఎన్నికలలో విజయం చేకూరాలని తోట చంద్రశేఖర్ దంపతులు  శ్రీనివాసరావుపేటలో ఈ యాగాన్ని నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మార్పును రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సమకాలిన రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. లాభం లేదని.. పాతికేళ్లు పాటు ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతూ అవిర్భవించిన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ మార్పు కోరుకునే ప్రజలు రానున్న ఎన్నికలలో తమ తీర్పును ఇవ్వనున్నారని.. దాంతో రాజకీయ పక్షాలకు షాక్ తగలక తప్పదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో ప్రజాతీర్పుతో తమ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు అభిలాషిస్తున్నారని చంద్రశేఖర్ తెలిపారు.

ఎన్నికలలో విజయం కోసం అన్ని పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ బాట పట్టాయి. తెలంగాణలో అధికారం కోసం కేసీఆర్ రాజశ్యామల యాజం చేయడంతో అదే బాటలో వైసీపీ అదినేత జగన్ కూడా అత్యంత రహస్యంగా అదే యాగాన్ని నిర్వహించారన్న కథనాలు వచ్చాయి. ఆ తరువాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని విజయవాడ ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం నిర్వహించారు. ఇక తాజాగా జనసేన నేత తోట చంద్రశేఖర్ దంపతులు కూడా అతిరుద్రయాగం చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thota Chandrasekhar  Guntur West  Pawan Kalyan  Athi Rudra Yagam  janasena  Guntur  Andhra Pradesh  Politics  

Other Articles