భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు తెలుసూ అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో యుద్ధం జరిగుతుందని రెండేళ్ల క్రితమే తనతో బీజేపీ నేతలు చెప్పారని పవన్ అన్నారు. కాగా.. కామెంట్స్ ఇప్పుడు మనదేశంతోపాటు.. పాకిస్తాన్ లో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్లోని ప్రముఖ మీడియా సంస్థ "డాన్" తన వెబ్సైట్లో ప్రస్తావించింది.
ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది. కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు డాన్ వెబ్సైట్ లింక్ చేసిన భారతీయ మూల ఇంగ్లీష్ వెబ్సైట్ కథనం పేర్కొంది. అంతేగాక పవన్ కల్యాణ్కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది.
బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ పేర్కొన్నట్లు ఆ కథనం వెల్లడించింది. కాగా.. పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశంలో కూడా రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. పవన్ చేసిన కామెంట్ల పై కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా పవన్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు.
अभिनेता से नेता बने #PawanKalyan ने गुरुवार को दावा किया, @BJP4India ने उन्हें दो साल पहले बताया था कि #LokSabha चुनाव से पहले युद्ध होगा। https://t.co/KYkdQQf8C4
— Arun Sarraff (@ArunSarraff_INC) March 1, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more