భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ పై బాగా పనిచేసింది. భారతీయుల ప్రార్థనలు కూడా ఫలించాయి. భారత వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలన్న దేశప్రజల వేడుకోలు భగవంతుడు కరుణించినట్లు వున్నాడు. తమ అధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శుక్రవారం ఆయన భారత్ లో క్షేమంగా అడుగుపెట్టనున్నారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
పాక్ పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను యత్నించానని, కానీ కుదరలేదని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను... భయపడుతున్నట్టుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. అభినందన్ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని చేతకాని తనంగా చూడొద్దన్నారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
5 నిమిషాల పుల్వామా ఘటన గురించి భారత్ మాట్లాడుతోందన్న ఇమ్రాన్ ఖాన్... 19ఏళ్ల కశ్మీర్ యువకుడు మానవ బాంబుగా ఎందుకు మారాడో ఆలోచించడం లేదని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఎంతకాలం నిందిస్తారని ప్రశ్నించారు. ఆధారాలు చూపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా అడుగుతారని చెప్పారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామిక్ రాడికలిజం అని అంటున్నారని... హిందూమతానికి చెందిన తమిళ టైగర్లు ఇదే విధంగా దాడులు చేసేవారని గుర్తు చేశారు. మరోవైపు ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more