తెలంగాణలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారలు టేకప్ చేశారు. దీంతో మూడేళ్లుగా దుమ్ముపట్టిన ఈ కేసు సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి... తన కుమారులతో సహా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు వారిని హైదరాబాదులోని కార్యాలయంలో విచారించారు.
అయితే, విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని... వేం నరేందర్ రెడ్డి చెప్పారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని, కేసుకు సంబంధించి అధికారులు అడిగిన డ్యాక్యుమెంట్లు అన్నింటినీ అందించామని చెప్పారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినట్టు తెలుస్తోందని చెప్పారు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.
దీంతో వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న వేం నరేందర్రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇవ్వజూపారన్న అభియోగంతో రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభియోగంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని విచారించారు. తాజాగా, రేవంత్ రెడ్డికీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో సెబాస్టియన్, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యలు సైతం నిందితులుగా ఉన్నారు. వేం నరేందర్రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు.. ప్రధానంగా రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు విచారణ పూర్తిగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more