సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో అటు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. ఇటు రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం చర్యలతో కేరళలో ప్రకృతి బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదల అంశం.. అందుకు కేంద్రం చేస్తానన్న సాయం.. ఇప్పటి వరకు అందించన నిధులు.. ఆప్తులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు.. ఈ విషయాన్ని మొత్తానికి పక్కదారి పట్టించి రాజకీయ లబ్దికోసం శబరిమల దేవాలయంలోని అయప్పస్వామిని కూడా వదలకుండా రాజకీయాలు చేయడం మలయాళీ మేధావులను కలవరానికి గురిచేస్తుంది.
వందేళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి బీభత్సం తాము చూశామని, చెప్పుకోచ్చిన స్థానికులు.. ఈ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం ద్వారా ఇళ్లేూ కూలి సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎలాంటి సాయం అందించాలన్న అంశాన్ని పక్కదారి పట్టించి.. కేవలం రాజకీయ స్వార్థం కోసం శబరిమల అయ్యప్ప స్వామిని. ఆలయ ఆచారాలను సాకుగా చేసుకుని అక్కడి పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరతీసాయని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అరోపిస్తూనే వున్నారు.
అందివచ్చిన అవకాశాన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తూనే వున్నాయి. మరీ ముఖ్యంగా కేరళలోని వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు ఏకంగా 51 మంది మహిళలు ప్రవేశించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారని గతంలో దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజాగా కేరళ సర్కార్ యూ-టర్న్ తీసుకుంది.
ఆలయంలోకి 51 మంది మహిళలు వెళ్లినట్టు తామిచ్చిన అఫిడవిట్ సరికాదని తేలిందని, ఇప్పటివరకూ ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని తాజాగా పేర్కొంది. మకరవిళక్కు సమయంలో జనవరి 1న బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు అనే ఇద్దరు నిషిద్ద వయస్సు మహిళలు పోలీసుల ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కాగా, వీరి దర్శనంతో అపవిత్రమైన ఆలయాన్ని మూసివేసిన అర్చకులు సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని తెరచి భక్తులను దర్శనానికి అనుమతించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more