ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన కొండపై దేవదేవుళ్లకు అలంకరించిన మూడు వజ్రఖచ్చిత కిరీటాలు అదృశ్యమైన వార్త పెను సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలోని కిరీటాలను దొంగిలించారన్న వార్త.. కలకలం రేపింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ముక్కు పుడుక పోయిందన్న వార్తను గుర్తుచేసింది. అయితే అప్పటికన్నా ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో వున్న ఈ తరుణంలో కిరీటాలు దొంగలించారంటే అది దొంగల గోప్పతనం కాదని.. ముమ్మాటికీ అది అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు అరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులు ఆలయ సిబ్బందిని, పూజారులను ప్రశ్నించిన తరువాత సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో వారు దొంగలు ఎవరన్న విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత అనుమానితులుగా బావిస్తున్న వ్యక్తి ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. భక్తుల ముసుగులో వచ్చిన దొంగలే వాటిని ఎత్తుకెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. అర్చకులు లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు చాకచక్యంగా కిరీటాలను దోచుకెళ్లినట్టు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల గుర్తించారు.
తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో అనుమానితుడి ఫొటోను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విడుదల చేశారు. చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా ఈ కేసులో మరెవరైనా నిందితులు వున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. ఆలయంలోని సీసీ కెమెరా కొన్ని రోజులుగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more