తనను నిత్యం వేదిస్తున్న ఓ పోకిరికి బుద్ది చెప్పాలని ప్రణాళిక రచించిన యువతి.. అంతా అనుకున్నట్లే చేసినా.. అసుపత్రి సిబ్బంది చాకచక్యం వల్ల నిజం బయటకు రావడం, పోలీసులకు సమాచారం అందడం, గంటలోపే కేసు చేధించడం అంతా చకచకా జరిగిపోయింది. ఇంకేముంది అనుకున్నదోక్కడి ఐనది ఒక్కటి బోల్లా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్న పాట పాడుకోవడం తప్ప. ఎందుకంటారా.. ఇక్కడే సీన్ రివర్స్ అయింది.
సికింద్రాబాద్కు చెందిన ఓ యువతి తన స్నేహితులతో కలిసి ఓ యువకుణ్ని కిడ్నాప్ చేసింది. అనంతరం అతణ్ని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. సదరు యువకుడు రోజూ తనను వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన ఆమె ఈ సాహస నిర్ణయం తీసుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. గురువారం (జనవరి 31) గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది.
హైదరాబాద్ పోలీసులు ఈ కిడ్నాప్ కేసును గంటలోపే చేధించడం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని గోపాలపురంలో నివాసం ఉంటున్నదివ్య (24) అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. తరచూ ఆమె బోరబండలో ఉంటున్న తన మిత్రురాలి వద్దకు వెళ్తుంది. కొంత కాలంగా సాయి (22) అనే యువకుడు ఆమెను వేధిస్తున్నట్లు ఆరోపిస్తోంది. తన ఫోన్కు అసభ్యకరమైన సందేశాలు పెడుతున్నట్లు పోలీసులతో చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా సాయి తన పద్ధతి మార్చుకోలేదని తెలిపింది.
తనను నిత్యం వేధిస్తున్న సాయికి తగినవిధంగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులతో దివ్య చెప్పింది. తన స్నేహితులతో కలిసి అతణ్ని కిడ్నాప్ చేసి.. కొట్టడానికి పథకం రచించినట్లు తెలిపింది. ఇంట్లో వాళ్లకు చెప్పడం ఇష్టంలేకే స్నేహితులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దివ్య తన ప్రణాళికలో భాగంగా కార్పెంటర్గా పనిచేస్తున్న సాయికి ఫోన్ చేసింది. అతడిని మురిపించేలా మాట్లాడి ఓ చోటకు రమ్మని పిలిచింది.
దివ్య ఫోన్లో చెప్పినట్లుగా సాయి.. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ కాలేజీ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న దివ్య స్నేహితులు అతణ్ని బైక్పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరింత మంది స్నేహితులు కలిసి సాయిని చితకబాదారు. అనంతరం మల్కాజిగిరి ప్రాంతానికి తీసుకెళ్లి మరోసారి కొట్టారు. తీవ్ర గాయాలైన సాయి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అతడి ఒంటిపై గాయాలుండటం చూసి అనుమానం వచ్చిన సిబ్బంది.. ఏం జరిగిందని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గంటలోపే కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యతో పాటు ఆమెకు సాయం చేసిన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. దివ్య తనను వేధించాడని చెప్తున్న సాయి ముఖాన్ని ఇంతవరకూ చూడకపోవడం కొసమెరుపు. సాయి ఆమె నంబర్ను ఎలా సంపాదించడనేది తెలియాల్సి ఉంది. తనను వేధించిన సాయిపై కేసు పెట్టడానికి దివ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more