వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్షపార్టీలు మహాకూటమి రూపంలో పోరాటానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ లో ఉప్పూనిప్పూగా ఉండే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు సైతం జత కట్టాయి. ఇదిలా ఉండగా, యూపీలో నాడు జరిగిన కుంభకోణాలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ కుంభకోణాలకు మళ్లీ తెరదీయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఉన్న సమయంలో చోటుచేసుకున్న గనుల తవ్వకాల కుంభకోణంపై ఈడీ అధికారులు ఇటీవలే సోదాలు ప్రారంభించడం ఇందుకు నిదర్శనం. తాజాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న స్మారకాల నిర్మాణాల కుంభకోణంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్, ఆ పార్టీ గుర్తు ‘ఏనుగు’ విగ్రహాల నిర్మాణాలను నాడు యూపీ వ్యాప్తంగా చేపట్టారు. ఇందుకుగాను, ఖజానా సొమ్మును వెచ్చించారన్నది ఆరోపణ.
దీనివల్ల కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారని ఆరోపిస్తూ యూపీ విజిలెన్స్ కమిషన్ లో దాఖలైన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. లక్నోలోని కొందరు అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏడు చోట్ల తనిఖీలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, 2007-12 మధ్య కాలంలో యూపీ సీఎంగా మాయావతి ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more