రాజకీయాలు వేరు స్నేహం వేరని టాలీవుడ్ కమెడియన్ అలీ అన్నారు. బాల నటుడిగా సీతాకోకచిలుక సినిమాతో తెరంగ్రేటం చేసిన అలీ.. హాస్యనటుడిగా, తెలుగు హీరోగా కూడా గుర్తింపు సాధించినా.. అవన్నీ ఇవ్వని ప్రత్యేకస్థానం మాత్రం హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే అది నిజమనే అలీ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. హీరో పవన్ కల్యాణ్ కు సన్నిహితుడు కావడం.
తనకంటూ వున్న అభిమానులతో పాటు ఇటు పవన్ అభిమానుల గుండెల్లో కూడా ఆయనకు ప్రత్యేక స్థానం వుంది. అలాంటి అలీ.. పవన్ కల్యన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరకుండా మిగతా పార్టీలవైపు ఎందుకు చూస్తున్నారన్న అర్థకాని ప్రశ్న. ‘పవన్ కల్యాణ్ అడిగితేనే జనసేనలోకి వెళతారా? మంత్రి పదవి ఆఫర్ చేయకపోవడం వల్లే జనసేనలోకి వెళ్లడం లేదా?’ లేక జనసేన అధికారంలోకి రాదని మీరు టీడీపీ. వైసీపీల చుట్టూ తిరుగుతున్నారా.? అని యాంకర్ ప్రశ్నించారు. ఈ విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు.
ఈ ప్రశ్నకు అలీ వెంటనే స్పందిస్తూ..‘నా పార్టీలోకి రా అలీ.. అని పవన్ కల్యాణ్ నన్ను పిలవలేదు. పవన్ పార్టీ పెడుతున్నారన్న విషయం నాకు ముందుగానే తెలుసు. అయితే ఈ విషయాన్ని పవన్ నాతో నేరుగా ఎన్నడూ చెప్పలేదు. పవన్ జనసేనను స్థాపించిన తర్వాత ఆయన్ను కలుసుకోలేదు. పార్టీ పెట్టాక ‘నువ్వు జనసేనలోకి రా.. నాకు హెల్ప్ చేయ్. పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొను’ అని పవన్ కోరలేదు. ఆయన వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతోనే పవన్ అలా వ్యవహరించి ఉండొచ్చు. అని అన్నారు.
అంతటితో అగకుండా పవన్ కల్యాణ్ తన సొంత మనుషులను ఎన్నడూ ఇబ్బంది పెట్టరు. అందుకే నేను వెళ్లలేదని జవాబిచ్చారు. తాను టీడీపీలో ఉన్నట్లు పవన్ కు తెలుసనీ, గతంలో ఎన్నికల సందర్భంగా ‘ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ ఇస్తారా నీకు? పోటీ చేస్తున్నావా?’ అని తనను అడిగారని గుర్తుచేసుకున్నారు. ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తే దానిలో చేరుతానని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more