సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయులతో పాటు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ పిడుగులాంటి వార్తను వినిపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు అధికాంగా వున్నాయని, వాటిని ఉగ్రవాద శక్తులు వాడుకునే అవకాశం కూడా వుందని.. దేశప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది.
అమెరికా ఇంటెలిజెన్స్ కమిటీ చీఫ్, సెనెటర్ డేనియల్ కోట్స్ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ హిందుత్వ నినాదాన్ని తలకెత్తుకుంటే భారత్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సెనెట్ సెలక్ట్ కమిటీకి నివేదికను సమర్పించారు. అందులో ప్రపంచవ్యాప్తంగా 2019లో హింస చెలరేగే అవకాశమున్న పరిస్థితులను ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ మే నెలలో జరిగనున్న ఎన్నికల్లో.. హిందుత్వ అజెండాను ప్రధానాంశంగా చేసుకుంటే భారత్ లో మత ఘర్షణలు తప్పవని కమిటీ వ్యాఖ్యానించింది. ఇప్పటికే బీజేపి నేతలు, ఆర్ఎస్ఎస్ సహా కేంద్రమంత్రులు కూడా హిందువులకు మద్దతుగా పలు వివాదాస్పద వ్యఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతతత్వం తీవ్రంగా వేళ్లూనుకుందని తెలిపింది.
తమ కార్యకర్తలను, మద్దతుదారులను సంతృప్తి పరిచేందుకు హిందుత్వ నేతలు తక్కువస్థాయి హింసకు పాల్పడే అవకాశముందని కమిటీ నివేదికలో పేర్కొంది. దీనివల్ల భారతీయ ముస్లింలు ఏకాకి అవుతారనీ, దీన్ని ఉగ్రసంస్థలు వాడుకునే అవకాశముందని హెచ్చరించింది. అలాగే భారత్-పాక్ మధ్య సంబంధాలు మే నెలలో ఎన్నికలు జరిగేవరకూ మెరుగయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more