ఫైతాన్, పెథాయ్ తుఫాన్లు విరుచుకుపడిన తరువాత తీరప్రాంతవాసులను మరో తుఫాను కలవరపరుస్తోంది. పెథాయ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షం సంభవించి చేతికందాల్సిన పంటను నీటముంచి రైతుల కన్నీళ్లకు కారణమైంది. ఈ తుఫాను ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా కనిష్టస్థాయికి చేరాయి. తీరప్రాంత జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలు పెథాయ్ దెబ్బ నుంచి కొలుకోకముందు మరో తుఫాను తీరప్రాంతవాసులను కలవరానికి గురిచేస్తోంది.
బంగాళాఖాతంలో మరో తుఫాను కేంద్రీకృతమైయ్యిందని, ఇది అండమాన్ నికోబార్ ద్వీపసమూహాల వైపు కదులుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం థాయ్ లాండ్ ను తాకిన పబుక్ క్రమంగా తన దిశను అండమాన్ నికోబాద్ దీపులవైపు మరల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
పబుక్ కారణంగా ఈ నెల 7 వరకు సముద్రం అలకల్లోలంగా మారిందని.. అంమాన్ ద్వీపాలు, అండమాన్ సముద్రంతో పాటుగా తూర్పుమధ్య, అగ్నేయ బంగాళాఖాతంలో కూడా సముద్రం ఉదృతంగా వుంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ ద్వీపాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కేంద్రహోంశాఖ సూచించింది.
మత్య్సకారులు చేపలకు వెళ్లవద్దని సూచించిన వాతావరణ కేంద్రం అధికారులు ఈ ప్రాంతంలో చేపట పట్టడాన్ని ఈ నెల 8 వరకు నిషేధించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. పబుక్ తుపాను క్రమంగా పశ్చిమ, వాయువ్య దిశలపై కదిలి మయన్మార్ తీరానికి ఈశాన్య దిశలకు చేరకుని ఆ తరువాత క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ఆదివారం నుంచి 70 నుంచి 90 కీలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more