భారత వాయుసేన అవసరాల కోసం రూపొందించిన జీశాట్-7ఎ విజయవంతంగా నిర్ధేశిత కక్షలోకి చేర్చింది జీఎస్ఎల్వీ-ఎఫ్11. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్11 వాహకనౌక జీశాట్-7ఎను నిర్ణీత కౌంట్ డౌన్ తరువాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కేవలం 30 నిమిషాల్లో జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 వాహననౌక 36 వేల కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది.
జీశాట్-7ఏ మన దేశం పంపిస్తున్న35వ సమాచార ఉపగ్రహం. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్- 7ఏ ఎనిమిదేళ్లపాటు సేవలందించనుంది. భారత వాయుసేన అవసరాల కోసం దీనిని వినియోగించనున్నారు. నెల రోజుల పరీక్షల తరువాత జీశాట్-7ఏ భారత వాయుసేన అవసరాలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మరీ ముఖ్యంగా మానవరహిత యుద్దవిమానాలను నడపడంలో దోహదపడుతుందని, లక్ష్య చేధనను కూడా సాధిస్తుంది.
జీశాట్-7ఏ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ శివన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీహరికోట నుంచి 35 రోజుల వ్యవధిలో మూడో ప్రయోగం నిర్వహించామని అన్నారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్ వీ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించామని చెప్పారు.
వారం రోజుల క్రితం వాతావరణ పరిస్థితులు సరిగా లేవని, మెట్ బృందం సమన్వయంతో ఈ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. కాగా, జీశాట్-7ఏ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనకు 70 శాతం, సైన్యానికి 30 శాతం ఉపయుక్తం కానుంది. జీశాట్-ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు వచ్చినట్టయింది. కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను జీశాట్-7 ఏ అందించనుంది. ప్రధానంగా విమానాలకు ఈ సిగ్నల్స్ ఉపకరించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more