తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కన్నా ముందుగానే రావడంతో ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు అనవసరంగా అందోళన చెందాల్సిన పనిలేదు. ఇలా ఎందుకు చెబుతున్నామంటే జీహెచ్ఎంసీ ఓటరు లిస్టుతో ఎన్నికల బరిలోకి వెళ్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారులకు హైకోర్టు ఇచ్చిన పలు అదేశాలను పరిగణలోకి తీసుకుని గత నవంబర్ నెల వరకు కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలను చేపట్టింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు.. తమ నివాసాలను మార్చుకున్న వారు తమ ఓట్లను నమోదు చేసుకున్నా.. వారికి మాత్రం ఇంకా ఓటరు గుర్తింపుకార్డులు నమోదు కాలేదు. ఈ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఈ సేవా, మీ సేవా కేంద్రాలకు అక్సిస్ అందుబాటులో లేకపోవడంతో.. వారు కూడా ఓటరు గుర్తింపుకార్డులను ఫ్రింట్ ఇవ్వలేకపోయారు. దీంతో తాము ఓట్లు నమోదు చేసుకున్నా.. ఎన్నికల కమీషన్ అధికారులు జారీ చేసే గుర్తింపు కార్డులు మాత్రం అందలేదు.
అయితే తాజాగా ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు లభ్యం అవుతున్నాయని ఈసీ అధికారులు తెలిపారు. ఇక ఈ కార్డులకు రూ. 30 కన్నా అధికంగా చార్జీలు కూడా వసూలు చేయకూడదని ఈసీ అదికారులు అదేశాలు జారీ చేశారు. ఇక ఈ గుర్తింపు కార్డులు లేని వారు.. రాని వారు కూడా అందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులు రాకున్నా కంగారు పడాల్సిన అవసరంలేదని తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి..ఓటరు ఐడీకార్డులేనివారు.. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఓటు వేసేటప్పుడు చూపించాలని సూచించింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
* ఫోటో ఓటర్ స్లిప్
* ఆధార్ కార్డు..
* డ్రైవింగ్ లైసెన్స్
* పాస్ పోర్టు..
* సర్వీస్ ఐడెంటిటీ కార్డు.
* బ్యాంక్ పాస్ బుక్స్…
* పాన్ కార్డు..
* ఆర్బీఐ విడుదల చేసిన స్మార్ట్ కార్డ్
* జాబ్ ఐడీ కార్డు
* కార్మిక శాఖ విడుదల చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
* ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్,
* ఎంపీ-ఎమ్మెల్యే -ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more