మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ఫలితాలు చిలక జోస్యాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రచారం చివర్లో సర్వేల పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రజాకూటమి పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలిసి కుట్ర చేసి అసలు ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. వీరిద్దరూ పొలిటికల్ టూరిస్టులే అని విరుచుకుపడ్డారు. డిసెంబర్ 11న ఫలితాల రోజున ఇద్దరూ తట్టా బుట్ట సర్దేస్తారని.. వెయిట్ అండ్ వాచ్ అని అన్నారు కేటీఆర్.
లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను తప్పుపట్టడానికి కారణాలను కూడా వివరించారు కేటీఆర్. తనకు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నవంబర్ 20వ తేదీన లగడపాటి ఓ సర్వే రిపోర్టును పంపించారని చెప్పారు కేటీఆర్. అందులో టీఆర్ఎస్ విజయం స్పష్టంగా కనిపించింది అంటూ… లగడపాటితో చేసిన వాట్సప్ చాట్ వివరాల స్క్రీన్ షాట్ ను.. కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. టీఆర్ఎస్ కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే వివరాలను తనకు పంపించినట్టు చెప్పారు.
చంద్రబాబు చేసిన ఒత్తిడితో అదే సర్వే రిపోర్టులో అంకెలు మార్చి లగడపాటి తప్పుగా ప్రకటించారని అన్నారు. చివరి రెండు వారాలుగా టీఆర్ఎస్ పలు అంశాలను బాగా డీల్ చేసిందని అందుకే పరిస్థితి మెరుగయ్యిందని లగడపాటి కేటీఆర్ కు చెప్పారు. నవంబర్ 20న సర్వే వివరాలను పంపిన లగడపాటికి…. 70 మార్క్ దాటి చూపించి సర్ ప్రైజ్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూశామని.. టీఆర్ఎస్ ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయో తనకు తెలుసని లగడపాటి చెప్పారు.
The reason I dismiss Rajgopal’s survey as concocted;
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more