అధికార పార్టీకి అదికారం దూరం అవుతుందన్న అందోళన వుందా.? అందుకనే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అధికార బలంతో చక్రబంధనంలో బంధించి తమ ప్రచారాన్ని చేసుకుని.. పనులు చక్కబెట్టుకుంటుందా.? అన్న అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు రోజులు వున్న సమయంలో అధికార పార్టీ పోలీసులను వినియోగించుకుని ప్రత్యర్థి నేతలను హడలెత్తిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మరికొందరు నేతల బంధువులు, కుటుంబసభ్యులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ రాజధాని నగరంలో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సనత్నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ మరో అభ్యర్థి కుమారుడి కారు డ్రైవర్పై దాడి చేయడం చర్చనీయాంశమైంది.
సనత్నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ కుమారుడు గౌరీశంకర్ గౌడ్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న నర్సింహయాదవ్ తో పాటు అతని మిత్రులు కారులో జెక్ కాలనీ ప్రాంతంలో వెళ్తుండగా గమనించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్.. కారును నిలువరించాడు. వారు కారు దిగగానే కారును తనిఖీ చేయాలంటూ హల్ చల్ చేశారు. తనిఖీ చేసేందుకు ఏ అధికారం ఉందని ప్రశ్నించడంతో కూన వెంకటేశ్ కుమారుడి కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడని కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
కాగా, సాయికిరణ్ పై చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేతలు సనత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి తలసాని కుమారిడిపై తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ సాయికిరణ్ ని అరెస్ట్ చేయాల్సిందేనంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సనత్ నగర్ పోలీసు ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more