సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆయేషా హత్య కేసులో విచారణ సవ్యంగా సాగలేదని గతంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. ఈ కేసు పునర్విచారణను సీబీఐకి అప్పగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అంటూ గతేడాది హైకోర్టు నిర్థారించింది.
అయితే ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చి శిక్షించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల ఫైలు కనిపించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయేషా కేసులో దర్యాప్తు సరిగ్గా లేదంటూ పోలీసులపై మండిపడింది.
2007 డిసెంబర్లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా దారుణహత్యకు గురైంది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులకు శిక్ష పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
కాగా, సీబీఐ ఎంట్రీపై అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో పలు సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే న్యాయనిపుణుల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ పరిపాలన అనుమతిని విత్ డ్రా చేసుకోవడానికి సర్వహక్కులు ఉన్నాయి. అయితే, ఆ రాష్ట్రానికి సంబంధించి కోర్టుల్లో ఉన్న ఏదైనా కేసు విషయంలో సుప్రీంకోర్టుగానీ, హైకోర్టు గానీ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం సీబీఐకి లేదు. నేరుగా కేసును విచారణ జరపవచ్చు. గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ అంటూ చెప్పిన నిబంధన ఈ విషయంలో వర్తించదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more