రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. ప్రజల్లోకి దూసుకెళ్తూ.. వారి సమస్యలను అవగతం చేసుకుంటూ సాగిపోతుంది. ఈ క్రమంలో త్వరలో రానున్న జెమిలీ ఎన్నికలకు ఆయన తన పార్టీని సమాయత్తం చేస్తూనే కార్యకర్తలు... పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాకులను ఉత్తేజపరుస్తున్న క్రమంలో పవన్ ప్రణాళికలను, వ్యూహాలను పక్కదారి పట్టించే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. అంతేకాదు ఆయనను పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి ఇప్పటికే విమర్శలు గుప్పించిన పలువురు రాజకీయ నేతలు.. పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ కు దిగగానే జంకుతున్నారు.
అసులు జనసేన ప్రభావమే లేదని పైకి చెబుతున్న రాజకీయ నేతలు.. కొందరు అద్దె మైకులతో ఆ విషయాన్ని బాహాటంగానే బయటకు కూడా చెప్పిస్తున్నారు. అయితే అసలు విషయం మాత్రం వారి గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది. ఆయన సభలకు ఏ నాయకుడు డబ్బులు పంచకుండా, ఏ నాయకుడు బిర్యానీలు, మద్యం బాటిళ్లను పంఫిణీ చేయకుండా కేవలం అభిమానంతో వస్తున్నా కార్యకర్తలు, అభిమానులను చూసి.. వీరు హృదయపూర్వకంగా వస్తున్నారు. వీరు అలాగే ప్రచారం చేస్తే.. జనసేనాని చెప్పినట్లు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చునన్న భయం వారిలో కనిపిస్తుంది.
అంతేఇక ఆయన దృష్టిని మరల్చే విధంగా సోషల్ మీడియా భుజాలపై బందుకులు పెట్టి పక్కదారి పట్టించే చర్యలకు పూనుకున్నారు. క్రితం రోజు నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా సెలవు ప్రకటించిన జనసేనాని.. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన ఆయన ఏపీలో యాత్రలు చేపట్టి.. ప్రచారం కూడా చేస్తున్నారు.
పవన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి.. వెన్నులో వణుకు పుడుతున్న కొందరు ఆయన దృష్టి మరల్చడంతో పాటు ప్రజలను, పవన్ అభిమానులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేసే ప్రక్రియకు నాంది పలికారు. ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకొని మళ్లీ ఓ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. డాలీ దర్శకత్వంలో రామ్ తుళ్లూరి నిర్మతాగా సినిమా తెరకెక్కుతుందని ఘంటాపథంగా వివరాలతో చెప్పడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
పూర్తి సమయం ప్రజా జీవితానికే - #JanaSena Chief @PawanKalyan pic.twitter.com/Alc9ok8wHy
— JanaSena Party (@JanaSenaParty) November 20, 2018
ఈ విషయంపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక తన జీవితం ప్రజాసేవకే అంకితం అని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించారను. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనల అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే’’ అని పవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more