రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు అన్యాయాలపై గురిపెట్టింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. త్వరలో గుంటూరు జిల్లాకు తన ప్రజాపోరాట యాత్రను తీసుకెళ్లనున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అరచకాలు, అక్రమాలపై టార్గెట్ చేయనున్నారు.
సోషల్ మీడియా ద్వారా కోడెల శివప్రసాద్ రావు ఆగడాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంతో పాటు నరసారావుపేట అసెంబ్లీ స్థానంలో కూడా ఆయనతో పాటు ఆయన తనయుడు సాగిస్తున్న అన్యాయాలు, అక్రమాలపై జనసేన అధినేత దృష్టిసారించారు. దీంతో వారి అడగాలపై పవన్ కల్యాణ్ గుంటూరు పర్యటనలో నిలదీయనున్నారు. తాను అభాగ్యులకు, పేదలకు, బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. వారు అవే వర్గాలను టార్గెట్ చేసి అన్యాయాలు, అక్రమాలు సాగిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
మరీ ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన మున్సిఫల్ చైర్ పర్సెన్ కోడలు.. దీపావళి బాణాసంచా దుకాణాల అనుమతుల విషయంలో వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెను సంచలనం కావడం.. కాకినాడ పర్యటనలో వున్న పవన్ కల్యాణ్ దృష్టికి ఇది రావడం.. ధీనిపై ఆయన చలించిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని జనసేన గుంటూరు జిల్లా పార్టీ నాయకత్వాన్ని అదేశించినట్లు సమాచారం.
దీంతో పాటు కోడెల పేరున ఆయన తనయుడు అక్రమంగా.. అసంఘటిత వర్తకుల నుంచి వసూలు చేస్తున్న రోజు మామూళ్లు, K Tax, ఫార్మా ఇండస్ట్రీ పేరుతో నకిలీ మందులు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, భూ దందాలు ఇలా తవ్వేకొద్దీ బయట పడుతున్న కోడెల ఆయన తనయుడు సాగిస్తున్న అక్రమాలపై పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. భారీ స్థాయిలో డబ్బు వసూలు చేయడం లాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలకు ఎదుర్కొంటున్న బాధితులను తాను స్వయంగా పరామర్శిస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. కోడెల అక్రమాలను, అన్యాయాలను సత్తెనపల్లి బహిరంగ సభ ద్వారా నిలదీస్తానని, అందుకు ఆయన సాగిస్తున్న అక్రమాల పూర్తి నివేదికను కూడా సమర్పించాలని పవన్ కల్యాణ్ పార్టీ జిల్లా నేతలను అదేశించారని తెలుస్తుంది.
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే, విఫ్ చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును టార్గెట్ చేశారు. ఆయన అధికారాన్ని వినియోగించుకుని ఆయన కొడుకు సాగిస్తున్న అక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించి.. పూర్తి నివేదికలను కొరడం.. ఇప్పడు పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి.. అధికారపక్షం అక్రమాలపై నిలదీయనున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more