ఆడదానికి అడదే శతృవు అన్నది పాత నానుడి.. ప్రస్తుతం అడవారిపై జరుగుతున్న దారుణాలకు అడవారికి అడవారే మద్దుతు ప్రకటిస్తున్నారు. ఎంతలా అంటే చివరకు న్యాయస్థానంలో ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అకృత్యపు కేసులో నిందుతుడ్ని దోషిగా పరిగణించకపోవడంపై మహిళాలోకం అందోళనను వ్యక్తం చేస్తూ.. తమ నిరసనను తెలిపింది. ఎంతలా అంటే ఇప్పుడీ బాధితురాలి తరపున యావత్ ప్రపంచంలోని మహిళా సంఘాలు కూడా అండగా నిలబడేలా చేస్తోంది.
తొలుత ఈ ఐర్లాండ్ కు చెందిన మహిళా ఎంపీ రూత్ కాపింజర్.. తమ దేశ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఆమె మహిళలు వేసుకునే అండర్ వేర్ ను ప్రదర్శిస్తూ తన కోపాన్ని ప్రదర్శించారు. అంతే అమెకు అండగా ఆ దేశంలోని మహిళలు వేల సంఖ్యలో అమె చర్యకు మద్దతు తెలిపారు. సామాజిక మాద్యమాలు మరీ ముఖ్యంగా ట్విట్టర్.. మహిళల అండర్ వేర్లతో నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచంలోని పలు మహిళా సంఘాలు కూడా ఇదే విధంగా తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఎందుకిలా.. అసలేం జరిగిందీ అంటే..
ఐర్లాండ్ లోని కార్క్ అనే పట్టణంలో ఇటీవల ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడిన 27 ఏళ్ల వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించారు. అందుకు కారణం.. అఘాయిత్యం జరిపిన వ్యక్తి తరుపున వకాల్తా పుచ్చుకున్న లాయర్ న్యాయస్థానం వాదనల సందర్భంగా మాట్లాడుతూ ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో తెలుసా అని ప్రశ్నించాడు. అమ్మాయి అప్పటికే మరొకరితో లైంగికంగా కలిసేందుకు సిద్ధపడిందని... అందుకు అమె వేసుకన్న అండర్ వేరే నిదర్శనమన్నారు. ఆమె వేసుకున్న బట్టలను పరిగణలోకి తీసుకోవాలంటూ జడ్జిని కోరారు.
దీంతో ఎంపీ రూత్ కాపింజర్ పార్లమెంటులో ఘాటుగా స్పందిస్తూ.. బాధితురాలిపై అత్యాచారం జరిగిందన్న విషయం మరిచి అమ్మాయి ధరించిన దుస్తులపై దృష్టి పెట్టడమేంటంటూ ప్రశ్నించింది. విచారణ సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఎప్పుడూ బాధితులను తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంపీ కాపింజర్ ఆరోపించారు. బాధితులను వేధించడం నిలిపేయాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బాధితురాలు వేసుకున్న అలాంటి అండర్ వేర్ అమె ప్రదర్శించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ స్పందించారు. ఇది ఒక్కరి సమస్య కాదని దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సమస్యగా చూస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు లైంగిక దాడులు - వేధింపులపై కఠిన చట్టాలు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయపరంగా కూడా పలు చట్టాలను తీసుకువస్తామని ప్రధాని చెప్పారు. అత్యాచార కేసుల్లో విచారణ కూడా త్వరతగతిని పూర్తయి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more