పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలల కాలంగా దూకుడు పెంచుతున్నాయి. వాహనదారులు ఇంధన అంటే భయపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరుగుతున్నా కేంద్రం స్పందించి.. నాలుగున్నరేళ్ల హయాంలో రూ.11 మేర పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించే అవకాశాన్ని అసలు పరిశీలించడం లేదు. వాహనదారులు పర్సులు గుల్లచేయడమే కేంద్ర, చమురు సంస్థల టార్గెట్ గా చేసుకుందా అన్న అనుమానాలు వినిపిస్తుంది.
ఆల్ టైం రికార్డ్ దిశగా ఎప్పుడో చేరుకున్న ఇంధన ధరలు ఈ ఏడాది మే మాసం నుంచి పెరిగుతూ వచ్చినా.. క్రమంగా తగ్గముఖం పట్టాయి. ఆ తరువాత గత రెండు నెలలుగా అంటే ఆగస్టు నుంచి ఏకబిగిన పెరుగుతూనే వున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా రూ.91 దాటిపోయింది. నగరంలో లీటరు పెట్రోల్ ధర 30పైసలు పెరిగి రూ.91.08గా ఉంది.
లీటర్ డీజిల్ ధర కూడా 32పైసలు పెరిగి రూ79.72గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇశాళ లీటరు పెట్రోల్ ధర 24పైసలు పెరిగి రూ.83.73గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.75.09గా ఉంది. ఢిల్లీలో సహజవాయువు ధరలు కూడా పెరిగాయి. దీని కారణంగా ప్రస్తుతం రాయితీ గల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.502.4కు చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.88.77కు చేరుకోగా, డీజిల్ ధర 81.68కి చేరుకుంది.
అటు బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర 84.40కి చేరుకోగా, డీజిల్ ధర 75.48కి చేరకుంది. ఇటు చెన్నైలో లీటరు పెట్రోల్ ధరలు 87.05కు చేరుకోగా, లీటరు డీజిల్ ధరలు 79.40కి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పెట్రోల్ ధరలు 8శాతం పెరగగా, డీజిల్ ధరలు 10శాతం పెరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more