అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అక్టోబరు 29న అయోధ్య కేసును విచారిస్తామని సీజేఐ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయోధ్య కేసు భూవివాదంగానే చూస్తామని..భూ యాజమాన్య హక్కులపై అక్టోబరు 29 నుంచి విచారిస్తామని స్పష్టంచేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనమే వాదనలు వింటుందని తెలిపింది.
ఇక 1994 నాటి ఫరూఖీ కేసు తీర్పును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నమాజు మసీదులోనే కాదు..ఎక్కడైనా చేయొచ్చంటూ 1994లో తీర్పు వచ్చింది. అప్పటి తీర్పును సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో సమర్థించింది. ఐతే చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ వాదనతో జస్టిస్ నజీర్ ఏకీభవించలేదు. 1994 నాటి తీర్పును పున:సమీక్షించాలని..కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.
కాగా, అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిలకు సమాన ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ 2010లో అలహాబాద్ కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయోధ్య కేసును త్రిసభ్య ధర్మసనమే విచారించనుండడంతో..సత్వర విచారణకు అడ్డంకులు తొలిగాయి. 2019 ఎన్నికల ముందే తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more