Sonia Gandhi Leads Opposition Protest Over Rafale Deal రాఫెల్ కుంభకోణంపై విచారణకు విపక్షాల డిమాండ్..

Sonia gandhi leads opposition protest over rafale deal outside parliament

Rafale Deal, Parliament, Loksabha, Rajya Sabha, Opposition Protest, Sonia Gandhi, RJD, Mayawati, BSP, JPC, Triple Talaq Bill, JPC, రాఫెల్ డీల్‌ స్కామ్. రాఫెల్ కుంభకోణం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, politics

The Congress has staged a protest over the NDA's Rafale deal. The protest has erupted outside the parliament, led by Sonia Gandhi demand for a probe or committee with JPC. The Congress has alleged that it is the biggest scam of the World.

ITEMVIDEOS: రాఫెల్ కుంభకోణంపై విచారణకు విపక్షాల డిమాండ్.. అందోళన

Posted: 08/10/2018 02:42 PM IST
Sonia gandhi leads opposition protest over rafale deal outside parliament

వర్షాకాల పార్లమెంట్  సమావేశాల చివరి రోజు రాఫెల్ డీల్ వివాదం ఉభయ సభలను కుదిపేసింది. రాఫెల్ డీల్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ రెండు సభల్లోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర కేబినెట్ అనుమతి లేకుండా వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకు ఆధారాలు కూడా వెలుగుచూస్తున్నాయని విపక్షాలు అరోపించాయి. రాఫెల్ డీల్ లో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపించాయి. దీనిపై వెంటనే విచారణను జరపించాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో జాయింట్ పార్లమెంటరీ కమిట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.

నిత్యం నీతివంతమైన పాలన అంటూ బీరాలు పోతున్న ప్రధాని నరేంద్రమోడీ.. తన పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషా అవినీతి విషయంలో విచారణకు జంకుతున్నారు. అంతేకాదు తాజాగా రాఫెల్ కుంభకోణంలోనూ విచారణకు వెనకడుతు వెస్తున్నారని కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. కాగా, కుంభకోణాల కాంగ్రెస్ పార్టీకి ప్రతిదాంట్లోనూ అవినీతి కనిపిస్తుందంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని, అందులో ఎలాంటి కుంభకోణానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం వాదనతో ఏకీభవించని ప్రతిపక్షాలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి.

సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీ, వామపక్షాల ఎంపీలు పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రాజ్యసభలో కూడా దీనిపై రచ్చ కొనసాగింది. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు తొలి రోజే విషమ పరీక్ష ఎదురైంది.  రాఫెల్ డీల్ మీద చర్చించాలంటూ 267 నిబంధన కింద కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ నోటీస్ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసేవారని చెప్పారు. అయితే, నిబంధనల ప్రకారం.. అలాంటి నోటీస్‌ల మీద రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకుంటారని, తానేమీ చేయలేనని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున బీజేపీ వ్యూహాత్మకంగా ట్రిపుల్ తలాక్ బిల్లును సభ ముందుకు తీసుకురాగా, విపక్షాలు రాఫెల్ డీల్ ను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafale Deal  Parliament  Loksabha  Rajya Sabha  Opposition Protest  JPC  Sonia Gandhi  Politics  

Other Articles