వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజు రాఫెల్ డీల్ వివాదం ఉభయ సభలను కుదిపేసింది. రాఫెల్ డీల్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ రెండు సభల్లోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర కేబినెట్ అనుమతి లేకుండా వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకు ఆధారాలు కూడా వెలుగుచూస్తున్నాయని విపక్షాలు అరోపించాయి. రాఫెల్ డీల్ లో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపించాయి. దీనిపై వెంటనే విచారణను జరపించాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో జాయింట్ పార్లమెంటరీ కమిట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
నిత్యం నీతివంతమైన పాలన అంటూ బీరాలు పోతున్న ప్రధాని నరేంద్రమోడీ.. తన పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషా అవినీతి విషయంలో విచారణకు జంకుతున్నారు. అంతేకాదు తాజాగా రాఫెల్ కుంభకోణంలోనూ విచారణకు వెనకడుతు వెస్తున్నారని కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. కాగా, కుంభకోణాల కాంగ్రెస్ పార్టీకి ప్రతిదాంట్లోనూ అవినీతి కనిపిస్తుందంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని, అందులో ఎలాంటి కుంభకోణానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం వాదనతో ఏకీభవించని ప్రతిపక్షాలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి.
UPA Chairperson Smt Sonia Gandhi and other Congress MPs protest against PM Modi's deal on the Rafale which he made without any approvals or clearances at the Parliament. pic.twitter.com/nwm8kOnxj3
— Congress (@INCIndia) August 10, 2018
సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీ, వామపక్షాల ఎంపీలు పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రాజ్యసభలో కూడా దీనిపై రచ్చ కొనసాగింది. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు తొలి రోజే విషమ పరీక్ష ఎదురైంది. రాఫెల్ డీల్ మీద చర్చించాలంటూ 267 నిబంధన కింద కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ నోటీస్ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసేవారని చెప్పారు. అయితే, నిబంధనల ప్రకారం.. అలాంటి నోటీస్ల మీద రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకుంటారని, తానేమీ చేయలేనని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున బీజేపీ వ్యూహాత్మకంగా ట్రిపుల్ తలాక్ బిల్లును సభ ముందుకు తీసుకురాగా, విపక్షాలు రాఫెల్ డీల్ ను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి.
लूटपाट नही चलेगा।
— All India Mahila Congress (@MahilaCongress) August 10, 2018
ये भ्रष्टाचार बन्द करो।#Rafale का पैसा कहां गया?@narendramodi जी जवाब दो।
.@MahilaCongress President @sushmitadevmp protesting outside the Parliament against the Rafael Deal along with @INCIndia leaders. pic.twitter.com/TS40UoZU9K
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more