సన్యాసులు. సాధువులు అరిషడ్ వర్గాలను నియంత్రణ వుంచుకుంటారని తెలిసిందే. కానీ చిన్న విషయంలో రేగిన గొడవలో కారును పూర్తిగా ధ్వంసం చేసి.. తమ ప్రకోపాన్ని చల్లార్చుకున్నారు సాధువులు. నిజమా అంటే ఇది నిజమే.. ఢిల్లీ మోతీనగర్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ కారుకు అడ్డంగా వున్న సాధువును పక్కకు జరగమని గట్టిగా చెప్పింది ఆ కారు నడుపుతున్న యువతి. దీంతో కోపాద్రిక్తుడైన భిక్షువు కారులోని యువతి పక్కనున్న యువకుడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అగ్రహానికి గురైన యువతి సాధువును చెంపపై కొట్టింది. తన ఐ10 కారుకు అడ్డంగా వచ్చిందే కాకుండా.. పక్కకు జరగమన్నందుకు ఏకంగా తన వారి కాలర్ ను పట్టుకుంటారా.? అంటూ ప్రశ్నించింది.
దీంతో అగ్రహావేశానికి లోనైన సాధువు తన వారికి విషయాన్ని చెప్పి.. కారుపై దాడి చేశాడు. దీంతో పరిస్థితిని గమనించిన కారులోని యువతీ యువకులు స్వల్ప గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేస్తున్నది సాధువులని చూసి వారిని నియంత్రించలేకపోయారు. పోలీసుల ఎదురుగానే సాధువులు కారును నుజ్జు నుజ్జు చేశారు. ఈ దృశ్యాలన్ని అక్కడ ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తం కావడం.. అవి బయటకు రావడం.. సోషల్ మీడియాలోకి చేరడం.. అవి విపరీతంగా వైరల్ కావడం అన్ని చకచక జరిగిపోయాయి.
ఘటన జరిగిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు కారు ధ్వంసానికి పాల్పడిన సాధువులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో తమను అన్వేషిస్తున్నారన్న సమాచారం అందుకున్న సాధువులు ఏకంగా పోలీసుల వాహనంపై దాడి చేశారు. సుమారుగా 50 మంది సాధువుల గుంపు ఈ దాడిలో పాల్పడిందని సమాచారం. కాగా, ఈ సంఘటనలో కారుపై దాడి చేసిన భిక్షువును పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ బోస్ అలియాస్ బిల్లా అనే సాధువును అదుపులోకి తీసుకున్నారు. మీరట్ ప్రాంతానికి చెందిన రాహుల్ నిరక్ష్యరాసుడే కాక నిరుద్యోగి కూడా. అంతేకాదు గతంలో పలు చోరీలు, ఇంటికి కన్నాలు వేసిన కేసులు కూడా ఇతనిపై నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇక అదే మీరట్ కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి సాధువులపై తన ప్రేమను కనబర్చడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంతి. ఏకంగా ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్న ఆయన.. శివభక్తులైన కన్వారియాల యాత్రం మీరట్ కు చేరుకోగానే వారికి స్వాగతం పలుకుతూ హెలికాప్టర్ నుంచి పూలను చల్లి తమ ప్రేమను చాటుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం కన్వారియాలు సృష్టించిన బీభత్సం నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి చేసిన చర్యలపై నెట్ జనులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇక మరికోందరైతే.. ఉన్నత స్థానంలో కొనసాగుతూ.. ఇలా ప్రేమను కనబర్చడాన్ని తప్పబడుతున్నారు.
#WATCH: A group of 'kanwariyas' vandalise a car in Delhi's Moti Nagar after it brushed past them while driving. The people in the car got off safely. No injuries were reported. Police says no formal complaint has been filed by the victims (07.08.2018) pic.twitter.com/rKc6VJMZnh
— ANI (@ANI) August 8, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more