పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. తగ్గింపు ధరలపై అటు కేంద్రంలోని మోదీ సర్కారుతో పాటు ఇటు అయిల్ కంపెనీలపై కూడా నెట్ జనులు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నా.. ఇంధన సంస్థలకు మాత్రం దున్నపోతుపై వానపడిన చందంగా చాలా లైట్ గా తీసుకుంటున్నాయి. మొన్న రూపాయి మేర ఇంధన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో వెనువెంటనే తమ నిర్ణయాన్ని మర్చుకుని కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గింపునిచ్చిన అయిల్ సంస్థలు.. నిన్న 7 పైసలు తగ్గింపునివ్వగా.. ఇవాళ కేవలం అరు పైసల తగ్గింపును వర్తింపజేశాయి.
పేరుకు మాత్రం ఇంధన ధరలు వరుసగా మూడు రోజుల పాటు తగ్గినా.. అసలు విషయానికి వస్తూ.. మూడు రోజుల తగ్గింపు కనీసం పావలా కూడా లేకపోవడంతో వాహనదారులు కేంద్రంతో పాటు అయిల్ సంస్థలపై మండిపడుతున్నారు. పెంచేప్పుడు ఏకంగా రూపాయల్లో పెంచే ప్రభుత్వాలు.. తగ్గింపు సందర్భంలో మాత్రం కేవలం పైసలకు మాత్రమే పరిమితం కావడమేంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
కాగా ఎల్పీజీ గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. నాలుగేళ్లలో పెరిగిన ఎల్ పీజీ ధరలు సామాన్యుడికి పెద్ద గుదిబండగా పరిణమించాయి. రెండు రోజులుగా ఒక పైసా, ఐదు పైసలు అంటూ పెట్రోల్ ధరలను తగ్గిస్తూ వస్తున్న ఆయిల్ కంపెనీలు.. సిలిండర్ ధరను మాత్రం రూపాయిల్లో పెంచాయి. సబ్సీడీ కలిగిన గ్యాస్ సిలిండర్ ధరను రూ.2.34 పెంచారు. అదే విధంగా సబ్సిడీయేతర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.48 పెరిగింది. ఒక్కసారిగా సిలిండర్ ధరలు పెంచటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలియకుండానే తమనెత్తిన బండ బాదుడు పడిందంటూ సామాన్యులు వాపోతున్నారు.
పెరిగిన ధరల ప్రకారం… దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.493.55 ఉండగా, కోల్ కతాలో అత్యధికంగా రూ.496.65కి చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.491.31, చెన్నైలో రూ.481.84 గా సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇక కమర్షియల్ LPG సిలిండర్ ధరలయితే భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన క్రమంలోనే గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయా.? అంటూ అందోళనగా చూసిన కస్టమర్లకు అనుకున్నట్లుగానే వారిపై బండపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more