అనుకోకుండా వచ్చే ఖర్చులకు, అవసరాలకు డబ్బు కావలంటే ఏం చేస్తాం. నగో, నట్రో తాకట్టు పెడతాం. అయితే అంతకుమించిన అవసరం ఏర్పడితే.. పొలమో.. ఇల్లో.. బండో.. తాకట్లు పెడతాం. అప్పటికీ అవసరం తీరకపోతే.. బంధువులదో, స్నేహితుల అస్తులను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం.. కానీ ఓ దేశముదురు చేసిన పనిని చోబితే మీకు షాక్ అవుతారంతే.! డబ్బు అవసరమైన ఈ దేశముదురు వాళ్లవి.. వీళ్లవి కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ (ఠాణా) తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం గతంలో చేసిన రుణమాఫీలలో ఈ అప్పు క్లియర్ అయినా.. మార్టిగేజ్ కింద నుంచి విముక్తి చేయడం మర్చిపోయాడు. అంతే ఎప్పుడో పాతికేళ్ల క్రితం చేసని తప్పు.. ఇప్పుడు శాపమై అతన్ని పట్టుకుంది. అసలే చట్టంతో అటలాడితే.. ఎవరైనా ఊచలు లెక్కబెట్టాల్సిందే అన్న డైలాగ్ గుర్తుకు తెస్తుంది.
అసలేం జరిగింది..? ఏమీటీ విషయం.. అంటారా..? వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్న సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మేజర్ గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్ టి.నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ నాయుడు.. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమై 1993వ సంవత్సరంలో గోనెగండ్లలోని 106, 35, 114, 452 సర్వే నెంబర్లపై సహకార సంఘం మార్టిగేజ్ కింద తాకట్టు పెట్టి రూ.10వేల అప్పు తీసుకున్నాడు. అందులో పోలీస్ స్టేషన్ కూడా ఉండటం విశేషం. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 452లో పోలీస్ స్టేషన్ తోపాటు పోలీస్ శాఖకు కేటాయించిన 4.13 ఎకరాల భూమి కూడా ఉంది.
గోనెగండ్ల సింగిల్ విండో ద్వారా కోడుమూరు కేడీసీసీ బ్యాంక్ నుంచి రూ.10వేలు తీసుకున్నాడు. వైఎస్ హయాంలో ఏర్పడిన ప్రభుత్వం అప్పటి రైతుల పోందిన రుణాలను పూర్తిగా మాఫీ చేసింది. దీంతో పది వేల రూపాయలను తీసుకున్న నాగేష్ నాయుడు రుణం కూడా మాఫీ అయ్యింది. తాను తలచిందే దైవం కూడా తలచిందని అనందపడ్డాడు. దీంతో సంతోషపడిన నాయుడు.. అసలు విషయాన్ని మర్చిపోయాడు. మార్టిగేజ్ లోన్ కు చెందిన ఒప్పందాన్ని కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రద్దు చేయించలేదు. దీంతో డబ్బు విషయంలో అన్ని తీరిపోయినా.. తాకట్టు పెట్టి అప్పుగా రుణం పొందినట్లు మాత్రం డాక్యూమెంట్లో స్పష్టంగా వుంది.
ఇటీవల పోలీస్ శాఖ సిబ్బంది క్వార్టర్స్ పున:నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈసీ తీయించారు. పోలీస్ స్టేషన్ తోపాటు ఆ స్థలం కూడా తాకట్టు ఉందని తెలిసి షాక్ అయ్యారు. విషయంపై విచారణ చేస్తే.. గోనెగండ్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంజ్ నిర్వాకం అని తేలింది. ఈ తతంగంపై కేసు నమోదు చేసి.. నిందితుడుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ను తాకట్టు పెట్టి మరీ బ్యాంక్ అప్పు తీసుకోవటం బహుశా దేశంలో ఇదే కావొచ్చు అంటున్నారు..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more