కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తరువాత ఇప్పుడా పని తన భుజాపైకి ఎత్తుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. కన్నడీగులను తన వైపుకు అకర్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలించాయో కానీ విమర్శకులైతే మాత్రం ఆయనను ఎద్దేవా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ సోదరుడు, సినీనటుడు, సాహితీవేత్త ప్రకాష్ రాజ్ ప్రధానిపై తన వ్యంగస్త్రాలను సంధించాడు. వచ్చే ఏడాది నుంచి మోడీతో దేశ ప్రజలకు పెద్దగా పనేమీ వుండదని, అప్పడు వస్తే తమ వాళ్లు చక్కగా తమ బాషను నేర్పిస్తారని ఎద్దవా చేశారు.
‘ప్రధాని మోదీ గారూ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నాలుగైదు సభల్లో ప్రధాని మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో స్థానిక ఎస్.ఎన్.ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఎన్నికల నేపథ్యంలో సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్రసంగించారు.
ప్రధానిని విమర్శించినంత మాత్రన తాను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తినని ముద్రవేసేస్తారేమో.. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాను అని ఆయన స్పష్టం చేశారు. ఇక తనకు బీజేపి వాళ్లతో ఏం భయం లేదని, వాళ్లు తననేమీ చేయలేరని చెప్పారు. బీజేపి నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మేలు చేసేవా? అని ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శించారు.
‘రాహుల్ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా’ అని అన్నారు. రాహుల్ పార్లమెంటులో 15 నిమిషాల వ్యవధి కావాలని కోరుతుంటే.. మీరు కర్ణాటక ప్రభుత్వం ప్రజల కోసం ఏం పథకాలు ప్రవేశపెట్టిందో పేపర్ చూడకుండా చెప్పాలని అడగటం ఎలా సమంజసమని ప్రశ్నించారు. చమత్కారాన్నంతా రుద్ది మసిపూసిన మారేడు కాయను చేసి.. ప్రజల చెవిలో పువ్వులు పెట్టగల ఘనులు మీరని.. అనవసరమైన విషయాలను పెద్దగా చూపి.. అవసరమై వాటిపై మాత్రం మౌనం వహించే మీ చతురత రాహుల్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే బీజేపి పతనం ఆరంభం అమవుతుంది’ అని జోస్యం చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more