కాంగ్రెస్ పార్టీకి రానున్న 2019వ సంవత్సరం బాగా కలసివస్తుందని, ఈ ఏడాది నుంచి కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకునే బాట పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి కాంగ్రెస్ ఇక విజయాల బాటలో పయనిస్తుందన్నారు. మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలు సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన జనాక్రోశ్ సభలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, అభివృద్ది పేరు చెప్పే పార్టీ దానికి అమడదూరంగా నిలిచిందని ఎద్దేవా చేశారు.
దేశంలో త్వరలో గణనీయమైన మార్పు కనిపించబోతోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇక వరుసపెట్టి విజయాలను సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన రాహుల్.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా తాము అధికారంలోకి వస్తామని.. బీజేపీ-అర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన రాహుల్.. ‘ఈయనేం ప్రధాని’.. ఓ వైపు డోక్లాంలో చైనా హెలీప్యాడ్ నిర్మిస్తుంటే ఈయన చైనా పర్యటనకు వెళ్లొచ్చారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడితో కలిసి చాయ్ తాగిన ఆయన డోక్లాం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
ఏటా రెండు కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని, కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగం తప్ప ఇంకోటి కనిపించడం లేదన్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అన్నవారే వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేశారని, ఇక ఇద్దరు మంత్రులు అత్యాచార నిందితులకు వెన్నుగా నిలచారని రాహుల్ గుర్తు చేశారు. దేశాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తనకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా రాహుల్ కోరారు.
తమ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్.. తమ పార్టీలో అందరి అభిప్రాయాలకు చోటు కల్పిస్తామని చెప్పిన ఆయన ఇదే అమిత్ షా- నరేంద్రమోడీ నేతృత్వంలోని పార్టీలో వారి అభిప్రాయాలనే ప్రజలపై రుద్దుతారని చెప్పిన ఆయన.. తాము ఎవరి అభిప్రాయాలను పంచుకోరని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాత్రం పేద్దల మాటలను వినాలని, వారిని గౌరవించాలని చెప్పే ప్రధాని.. అచరణలో మాత్రం వారే తమ పార్టీ పెద్దల మాటలను లక్ష్యపెట్టరు. వారికి కనీసం గౌరవమర్యాదలు కూడా ఇవ్వరని విమర్శించారు.
గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 స్థానాలు కూడా రావని విమర్శించిన నేతలు.. కాంగ్రెస్ ప్రభంజనం చూసిన ప్రధాని తనపై హత్యాయత్నం జరుగుతుందని సానుభూతి వ్యాఖ్యలతో అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష, పట్టుదల ముందు తలవంచుకన్న మోదీ.. సముద్రం మార్గంలో సముద్రవిమానం ద్వారా పారిపోయారని ఎద్దేవా చేసిన ఆయన ఇక కర్ణాటక ఎన్నికలలో ఎలా పారిపోతారో వేచి చూడాలని విమర్శించారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానన్న మోడీ.. కర్ణాటకలో అవినీతి ముద్రపడిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more