బాలీవుడ్ వివాదాస్పద నటిగా, ఐటమ్ బాంబ్ గా పేరొందిన నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపుకు జీవితఖైదు పడిన నేపథ్యంలో అమె పెదవి విరిచింది. అయితే న్యాయవ్యవస్థపై, న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన అమె.. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఉరి శిక్ష సరైందని అభిప్రాయపడింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం అశారాం బాపును శిక్షించాల్సిందని అభిప్రాయపడింది.
ప్రస్తుతం సమాజంలో ఏ మగవాడిని చూసినా అతను కామాంధుడేనా అన్నట్లుగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయిని.. భయం వేస్తుందని.. ఎవరు అప్తుడో.. ఎవరు మగమృగమో ఎలా కనిపెట్టేదని అమె భయాందోళన వ్యక్తం చేశారు. అయితే చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్షే సరైనదని ఆమె అభిప్రాయపడింది. మైనర్ లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం చెబుతోందని... ఈ నేపథ్యంలో ఆశారాం బాపుకు ఉరిశిక్షే సరైనదని చెప్పింది.
మైనర్ బాలికల జీవితాలను చిదిమేసే వారిని వదలకూడదని తెలిపింది. ఆశారాంకు విధించిన శిక్ష...రేపిస్టులకు ఒక హెచ్చరిక అని రాఖీ సావంత్ చెప్పింది. తాము సంప్పన్నులం, అధికార పలుకుబడి కూడా కలిగిన వాళ్లం.. తాము ఏం చేసినా చెల్లుతుంది.. చట్టం, న్యాయం తమవైపే వుంటాయని భ్రమల్లో బతికే వారికి ఈ తీర్పు చెంపపెట్టని అమె పేర్కొంది. అయితే కతువా రేపిస్టులను కూడా ఉరి తీయాలని, అలా చేస్తే తాను జీవితాంతం బీజేపికి ఓటు వేస్తానని రాఖీ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more