కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటనలో ఆ భయానక అనుభవాన్ని తలచుకుని విమానంలో వున్న ఎవరికి వారు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని భయాందోళనకు లోనుకాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా వున్నాడు. అందుకు కారణం ఆయన కూడా స్వయంగా పైలెట్ కావడమే. అయితే తనతో పాటు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను కాదని.. ఆయన ఏకంగా పైలెట్ల వద్దకు వెళ్లి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు గాను సలహాలు, సూచనలు ఇచ్చాడు.
అదో చిన్న చార్టర్ విమానం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీ, తన టీమ్ తో సహా వెళుతున్న వేళ.. ఒక్కసారిగా కుదుపులు. ఓ వైపు ఒరిగిపోయి అలాగే కిందకు జారుతోంది. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. పైలెట్లు కష్టం మీద విమానాన్ని నడుపుతూ మెల్లిగా ఎయిర్ పోర్టు వైపు తీసుకు వస్తున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ.
విమానాన్ని ల్యాండింగ్ చేయాలని చేసిన తొలి ప్రయత్నం విఫలం. రెండోసారీ అదే ఫలితం. అసలు విమానం క్షేమంగా ల్యాండ్ అవుతుందా? అని హుబ్లీ ఎయిర్ పోర్టు అధికారుల్లో తీవ్ర ఆందోళన. మూడోసారి విమానం క్షేమంగా దిగింది. ఈ అనుభవంతో విమానంలో వున్న రాహుల్ టీమ్ అంతా భాయానక అనుభవం అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే రాహుల్ మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా వున్నారని అయనను కొనియాడారు.
ఈ భయానక అనుభవాన్ని తలచుకున్న రాహుల్ ప్రధాన అనుచరుడు కౌశల్ విద్యార్థి.. తన జీవితంలోనే ఇది అత్యంత భయంకరమైన రోజుగా అభివర్ణించారు. విమానంలోని వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్న వేళ, రాహుల్ గాంధీ, ప్రశాంతచిత్తంతో కూర్చుని ఉన్నారని, ఆయనలో ఎటువంటి ఆందోళనా కనిపించలేదని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నామని తెలిసి కూడా ఆయన నిబ్బరంగా ఉన్నారని అన్నారు. కొద్ది సేపటి తరువాత అయన నేరుగా పైలెట్ క్యాబిన్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు.
ఇక మరో ముఖ్య అనుచరుడు రాహుల్ ఎస్ రవి కూడా రాహుల్ గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు. స్వతహాగా పైలెట్ కావడం వల్లే రాహుల్ లో ఇంత నిబ్బరం వుందా..? లేక దేవుడే అతనికి ప్రసాదించాడా తెలియదు కానీ.. క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో వారికి సహకరించాడని కొనియాడారు. అయితే విమానంలో సమస్య కావాలనే సృష్టించి ఉండవచ్చన్న అనుమానం తలెత్తిందని, దీనిపై సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక డీజీపీ ఎన్ నీల్ మణి రాజుకు కౌశల్ లేఖను రాశారు. కాగా, విమానం ల్యాండ్ అయిన తరువాత తన షెడ్యూల్ లో ఉన్న ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more