కర్ణాటక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టు కన్ఫామ్ అయ్యింది. ఆయన ఉత్తర కర్ణాటకలోని తెలుగువారు అధికంగా వుండే ప్రాంతంలో ప్రచారం చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన ఏ పార్టీకి కాకుండా కేవలం తన స్నేహితుల తరుపున మాత్రమే ప్రచారం చేయనున్నారన్న వార్తలుకూడా వినిపించాయి. కాగా, తాజాగా ఆ ఊహాగానాలన్ని తప్పని తేలిపోయింది.
జనసేనాని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారన్న మాట ముమ్మాటికీ వాస్తవమే అయితే అది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ఇటు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మకద్రోహం చేసిన బీజేపిలకు కాకుండా తన మిత్రుడైన జేడీఎస్ అధినేత కుమారస్వామికి మద్దతుగా పవన్ కల్యాన్ ఈ సారి ఎన్నికలలో ప్రచారం చేస్తారని కన్ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని జేడీఎస్ చీఫ్ కుమారస్వామియే స్వయంగా వెల్లడించారు. మే నెల తొలివారంలో పవన్ కల్యాన్ తమపార్టీ తరపున ప్రచారం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలతోపాటు ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్తో ప్రచారం చేయించడం ద్వారా వారి ఓట్లను కొల్లగొట్టాలనేది కుమారస్వామి ఆలోచన. ఇక్కడ కనీసం 18 స్థానాలైనా గెలవాలని జేడీఎస్ పట్టుదలగా ఉంది. జేడీఎస్ తరపున ఇప్పటికే హీరోయిన్ పూజాగాంధీ, జాగ్వార్ హీరో నిఖిల్లు ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక మరోవైపు సివిల్స్ టాపర్లకు కూడా జనసేనాని అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ ద్వారా మెట్పల్లి జిల్లాకు చెందిన సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సివిల్స్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నిన్ను చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఈ మూడు వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం కూడా అనుధీప్ లక్ష్యసాధనకు దోహదపడ్డాయని జనసేనాని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more