ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికంగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అదరహో అనిపిస్తున్నారు. వెయిట్ లిప్టింగ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన భారత్.. అదే విభాగంలో ఏకంగా మూడు స్వర్ణాలను సొంతం చేసుకుంది. కాగా తాజాగా వెయిట్ లిప్టింగ్ 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ సాధించాడు. దీంతో మొత్తంగా నాలుగు స్వర్ణాలను భారత్ ఈ విభాగంలో సాధించినట్లైంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లకు చెందిన రాగల వెంకట రాహుల్ స్వర్ణ పతకాన్ని సాధించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ రోజు పవన్ ట్వీట్ చేస్తూ... 'రాగాల వెంకట రాహుల్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన ఆయనకు జనసేన పార్టీ తరఫున రూ.10లక్షల చెక్ను ప్రోత్సాహకంగా ఇస్తాం. రాహుల్ స్వర్ణ పతకం సాధించి, మన మాతృభూమి భారత్ గర్వపడేలా చేశారు. నీ అత్యద్భుత విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. జనసేన పార్టీ నీకు సెల్యూట్ చేస్తోంది.. జై హింద్' అని పేర్కొన్నారు.
Heartfelt congratulations to“ Sri Venkat Rahul Ragala.“From JSP we will give him a ₹10 lakh cheque for achieving Goldmedal in common wealth games & making our Mother Land “Bharath” proud. We truly take pride in your outstanding achievement & JSP salutes you. Jai Hind! pic.twitter.com/jBhu8y78Sc
— Pawan Kalyan (@PawanKalyan) April 9, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more