ఎప్పడు ఏం మాట్లాడతారో.. ఎప్పుడు తన మాటల నుంచి యూ టార్న్ తీసుకుంటారో.. అందుకు సింపుల్ గా మీడియా తన మాటలను వక్రబాష్యం చెప్పిందని తప్పించుకుంటారో వారే రాజకీయ నేతలు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి రాజకీయ నేతలకు కొదవ మాత్రం లేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ఈజీగా మాటలు మార్చిన నేతలు.. యూటార్న్ తీసుకుని ఢిఫెన్స్ లో పడినా.. తమదే పైచేయి కావాలని మాత్రం చేయని ప్రయత్నాలు వుండవు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్థంభింపచేసిన టీడీపీ ఎంపీలలో ఒకరైన జేసి దివాకర్ రెడ్డి.. పార్లమెంటు అవరణలో ప్లకార్డులతో ప్రదర్శనలు చేస్తున్న వైసీపీ నేతలను ఉసిగొల్పుతూ.. దమ్ముంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసిన నిరాహారాదీక్షలు చేస్తు్న క్రమంలో యూటార్న్ తీసుకున్న ఆయన రాజ్యసభ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక తాజాగా ప్రత్యేక హోదా కోసం పోరాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మరోమారు యూటార్న్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం చేసే పోరాటం మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తనకు తెలిసినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాన్ని శిరసావహిస్తూ హోదా పోరాటంలో భాగమవుతున్నానని ఆయన చెప్పారు. మోదీ మొండి వైఖరి తెలిసినందువల్లే తానీరకంగా మాట్లాడుతున్నానని, ఆయన హోదా ఇవ్వరని జేసీ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా కాకున్నా, హోదాకి సమానమైన ప్యాకేజీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. చాలినన్ని నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రజలను ఒప్పించే బాధ్యత తమదని ఆయన కేంద్రానికి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more