భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్.. సరిగ్గా ఇవాళ సాయంత్రం 4.56 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో.. 2015 ఆగష్టులో ఇస్రో జీశాట్-6ను ప్రయోగించిన తరువాత మళ్లీ దాదాపుగా మూడేళ్ల తరువాత జీశాట్-6ఏ రెండవ సారి ఇక్రో నింగిలోకి పంపింది.
జీశాట్-6ఏ ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చుతుంది. ఇందుకోసం ఇస్రోకి రూ. 270 కోట్లు ఖర్చు అయింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైంది. మిలటరీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఇస్రో అధికారులు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో రాకెట్ రెండో దశలో అధిక విస్పోటనం కలిగిన వికాస్ ఇంజిన్, ఎలక్ట్రోమెకానికల్ ఆక్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇస్రోవేత్తలు, కుటుంబ సభ్యులకు అభినందలని ఇస్రో ఛైర్మన్ కే శివన్ అన్నారు. ఈ రోజు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కే శివన్ మాట్లాడుతూ... ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తాము 9 నెలల్లో 10 మిషన్లకు ప్రణాళిక వేశామని, అలాగే ఈ ఏడాది చంద్రయాన్-2 ఉందని పేర్కొన్నారు. కాగా, జీశాట్-6ఏ.. మల్టీబీమ్ కవరేజ్ ద్వారా దేశ వ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్కు ఉపయోగపడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more